మహానది డెల్టా నుంచి 90 కిలోమీటర్ల దూరంలో జాజపూర్ జిల్లాలో వున్న చిన్న కొండ లంగుడి హిల్స్. ఈ కొండ, మైదానాల గుండా ప్రవహించే అందమైన కేలువా నది ఈ ప్రదేశాన్ని అంతటినీ చాలా అందంగా మార్చి వేస్తుంది. అందంగా ఉండడమే కాక, ఇక్కడ ఓడిశా లోని అరుదైన బౌద్ధ శిల్పాలు వున్నాయి. ఇక్కడి తవ్వకాల్లో బయటపడ్డ రాళ్ళను తొలిచి తయారు చేసిన 34 స్తూపాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. దీనితో పాటు ‘సమాధి ముద్ర’ లో చిరునవ్వుతో వున్న బుద్ధుడి విగ్రహం తో పాటు ఇతర భంగిమల్లో వున్న విగ్రహాలు లంగుడి హిల్స్ కు ఎంతో మంది యాత్రికులను ఆకర్షిస్తాయి.
ఈ ప్రదేశం ఇప్పుడు భారతీయ పురావస్తు శాఖ సంరక్షణలో వుంది. ఇదే కాక కొన్ని హిందూ దేవతలా అద్వితీయమైన విగ్రహాలు కూడా ఇక్కడ వున్నాయి. చిరునవ్వుతో, భారీ అలంకరణలతో రాతి నుంచి చెక్కిన తారా దేవి అధ్బుతమైన శిల్పం చూసి తీరాల్సిందే. రాతి నుంచి తొలిచిన ఒక చేతిలో కమలం పట్టుకుని వుండే ‘ప్రజ్ఞా పరామిత’ విగ్రహం ప్రాచీన, మధ్య యుగాల నాటి ఇక్కడి సంప్రదాయంలో స్త్రీ దేవతల ప్రాధాన్యాన్ని వివరిస్తుంది.