ఉదయగిరి గుహలు కటక్ జిల్లా, భువనేశ్వర్ కి చాలా దగ్గరలో సుందరమైన కొండలపై ఉంది. ఉదయగిరి లో మొత్తం 18 గుహలు ఉన్నాయి, ఇవి భారతదేశ పురావస్తు పరిశోధన సంరక్షణలో ఉన్నాయి. ఈ గుహలు పురాతన నిర్మాణాలకు ప్రత్యెక కళాఖండాలు, జైన్ సన్యాసుల నివాసాల కోసం ఖారవేల రాజు వీటిని నిర్మించారు. ఉదయగిరి గుహలు క్రీశ. 2 వ శతాబ్ద౦ నాటివని గమనించండి. అద్భుతమైన చేక్కుళ్ళు, స్పష్టంగా మలచిన ఈ గుహలు అనేక బౌద్ధ పర్యాటకులకు ఆకర్షణ కేంద్రాలు.
ఇటీవల తవ్వకాలలో బయటపడిన బౌద్ధ ఆరామాలు, స్థూపాలను ఇక్కడ చూడవచ్చు. బౌద్ధ పర్యాటకులు సమూహాలుగా ఈ ప్రాంతానికి తరలి వస్తారు. అన్ని గుహలు, రానిగుమ్ఫా, హతిగుమ్ఫా, గానేసగుమ్ఫా భారీ శిల్పాలతో ఉన్నాయి, ఖారవేల వంశానికి చెందిన తెరవబడిన అనేక పురాతన చారిత్రిక నిజాలతో కూడిన శాసనాలు ఇక్కడ కనిపిస్తాయి. అలాగే ఇతర గుహలలో అనేక అందమైన శిల్పాలను చూడవచ్చు. ఖండగిరి గుహలు ప్రస్తుతం ఉదయగిరి గుహలతో కలిసిపోయి సందర్శించడానికి విలువైనవిగా ఉన్నాయి. ఈ గుహలు సందర్సన కోసం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరవబడి ఉంటాయి.