ఆనెగుడ్డె అంటే ఏనుగు పర్వతం అంటారు. ఇదిహిందువుల పవిత్ర భగవంతుడు వినాయకుడిది.ఈ ప్రదేశం యాత్రికులకు ఎంతో ప్రధానమైంది. ఇక్కడ పరశురాముడు సృష్టించిన ఏడు యాత్రా స్ధలాలు కనపడతాయి. ఇక్కడ ప్రధాన విగ్రహం వినాయకుడు వెండి విగ్రహంగా ఉంటుంది. ఇది నిలబడి ఉండటం ఒక విశేషం. ఈ దేవాలయంలో తులాభారం ద్వారా కానుకలు సమర్పిస్తారు. ఒక వ్యక్తి బరువుకు సమానంగా ఈ కానుకలు ఇస్తారు. ఈ క్షేత్రంలో భార్గవ పురాణంలోని అంశాలు శిల్పాలుగా చూపబడతాయి.
ఈ స్ధలం కుందాపూర్ కు 9 కి.మీ. దూరంలో కుంభషి అంటారు. మంగుళూరు నుండి 84 కి.మీ. ఉంటుంది. ఈ ప్రదేశం జాతీయ రహదారి 17 పై ఉంది. మంగుళూరు, ఉడుపి, కుందాపూర్ లనుండి బస్ సర్వీస్ నిర్వహిస్తున్నారు. సమీప విమానాశ్రయం మంగుళూరు.