ఉడుపి పట్టణంలో చంద్రమౌళీశ్వర దేవాలయం పురాతన దేవాలయాలలో ఒకటి. దీనిని ఉడుపి ఆజ్య అని కూడా అంటారు. క్రిష్ణుడి దేవాలయం చూసే ముందు దీనిని చూడాలని విశ్వసిస్తారు. దేవాలయం చాళుక్య శిల్ప శైలి కలిగి ఉంటుంది. సుమారు 7వ లేదా 8వ శతాబ్దానికి చెందినదిగా చెపుతారు. దీనిని అనంతేశ్వర రదేవాలయంతో పాటే నిర్మించారు.
చంద్రుడు దక్షప్రజాపతి నుండి శాపం పొంది, శాప విమోచనకై శివుడిని ప్రార్ధించాడని కనుక ఇది చంద్రమౌళీశ్వర దేవాలయంగా ఆవిర్భవించిందని చెపుతారు
. ఈ దేవాలయం మణిపాల్ నుండి 3 కి.మీ.లు మాల్పే నుండి 6 కి.మీ.లు, మంగుళూరు నుండి 60 కి.మీ.లు మరియు కుందాపూర్ నుండి 30 కి.మీ.లు ఉంటుంది. సమీప రైలు స్టేషన్ మంగుళూరు.