అతాష్ బెహ్రం: ఉద్వాడ పట్టణం జొరాస్ట్రియనుల అతాష్ బెహ్రం కు ప్రసిద్ధి చెందింది. బెహ్రం అంటే జొరాస్ట్రియన్ల ప్రార్ధనా ప్రదేశం, దీని వలన ఉద్వాడ విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రార్ధన ప్రాంతం జొరాస్ట్రియన్ల ఎంతో పవిత్రమైన అగ్ని దేవాలయాలలో ఒకటే కాక బహుశా నిరంతరం మండే అగ్ని ఉన్న అతి పురాతన అగ్ని దేవాలయం.
ఉద్వాడ లోని బెహ్రం ప్రపంచంలో ఉన్న తొమ్మిది అతాష్ బెహ్రం లలో ఒకటి కాగా, వీనిలో ఎనిమిది భారతదేశంలో ఉండగా, ఒకటి మాత్రం మధ్య ఇరాన్ లో ఉంది. ఉద్వాడలోని అగ్ని దేవాలయాన్ని1742 వ సంవత్సరంలో నిర్మించారు, జొరాస్ట్రియన్ సంఘానికి చెందిన వారందరూ దీనిని ఎంతో పవిత్ర మైనదిగా పరిగణిస్తారు.