పీర్ మత్సఎంద్రనాథ్, దీనికి నాథ శాఖ, గొప్ప శైవుల నాయకుడు, మత్సఎంద్రనాథ్ పేరు పెట్టబడింది. ఈ నాయకుడిని తన అనుచరులు పీర్ అని పిలుస్తారు మరియు ఈ స్థానం అత్యంత హిందువులు మరియు ముస్లింలు, ఉభయులచేత గౌరవింపబడుతున్నది. ఇది శిప్రా నది ఒడ్డున ఉన్నది. ఈ స్థలం భర్తృహరి గుహలు మదియు గడ్కలిక ఆలయానికి దగ్గరలో ఉన్నది.
ఇది ఉజ్జయిని ముఖ్య నగరానికి 1 కి.మీ దూరంలో ఉండటంవలన, ఈ ప్రదేశాన్ని సులభంగా చేరుకోవొచ్చు. ఇక్కడ పురాతత్వ శాఖవారు తవ్వకాలలో కొన్ని మరణించిన వారి శిథిలాలు దొరికాయి మరియు ఇవి 6వ మరియు 7వ శతాబ్దం నాటివి. ఈ ప్రదేశం యొక్క నిర్మాణశైలి ఇదివరకెన్నడు చూడలేదు. ఇది ఒక సాధారణ తెల్లని నిర్మాణం కానీ శైలి చాలా భిన్నంగా ఉంటుంది.
ఈ నిర్మాణాత్మక రూపకల్పనలో నాణ్యత పరిశీలించడానికి, నిర్మాణ వివరాలను చాలా దగ్గరగా చూడవలసి ఉంటుంది. ఇక్కడికి ప్రతిరోజూ చాలా మంది సందర్శకులు వొస్తుంటారు.