సిద్ధవట్, పవిత్ర పట్టణం అయిన ఉజ్జయినిలో ఉన్నది. శిప్రా నది ఈ ప్రదేశం గుండా ప్రవహిస్తున్నది. ప్రయాగ్ యొక్క అక్ష్యవత పవిత్రత వాళ్ళ ఈ ప్రదేశం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశాన్ని సందర్శించేవారు ఇక్కడ శిప్రా నదిని తాబేలులాగా సిద్ధవట్ వొద్ద చూడవొచ్చు. సిద్ధవట్ ఘాట్ పోస్ట్ అంత్యక్రియ కర్మలకు ప్రసిద్ధి చెందింది.
మధ్య ప్రదేశ్ రాష్ట్ర చుట్టుపక్కల ప్రజలతో సహా సంవత్సరమంతా కర్మకాండలు జరిపించటానికి ఇక్కడికి వొస్తారు. ఈ స్థలాన్ని పురాణాలలో ప్రేత-శిలల-తీర్థ అని చెప్పబడింది. ఇక్కడి స్థానికులు ఈ స్థలంలోనే పార్వతి ప్రాయశ్చిత్తం ఒనరించుకున్నదని నమ్ముతారు.
ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టును నరికివేసి ఆ ప్రాంతమంతా ఇనుము షీట్లతో కప్పటం జరిగింది. కాని ఆశ్చర్యకరంగా ఈ ఇనుప షీట్ల మధ్య నుండి మర్రి చెట్టు చీల్చుకుని వొచ్చింది. ఆ రోజునుండి ఈ స్థలం పవిత్రమైనదిగా ఇక్కడి స్థానికులు భావిస్తున్నారు. ఈ స్థలంలో నాథ్ శాఖవారు పూజలు జరుపుతున్నారు.