చిన్తపుర్ని టెంపుల్ సముద్ర మట్టానికి సుమారు 940 మీటర్ల ఎత్తున కలదు. ఈ టెంపుల్ హిందూ శక్తి పీఠాల లో ఒకటి గా భావిస్తారు. చిన్తపుర్ని దేవి ఇక్కడ దేవత. ఈ టెంపుల్ భార్వైన్ నుండి 3 కి. మీ.ల దూరం లో వుంటుంది.ఈ టెంపుల్ ను పండిట్ మై దాస్ అనే సరస్వతి బ్రాహ్మిన్ కనుగొన్నారు. టెంపుల్ ప్రధాన ఆకర్షణ... అంటే దేవత కొలువైన గర్భ గ్రిహం. ఈ రాతి టెంపుల్ కు ప్రవేశం ఉత్తరంగా వుంటుంది. దీనిలో గణేశ మరియు హనుమాన్ విగ్రహాలు కూడా వుంటాయి.
అమ్మవారు రాతి విగ్రహం లో వుండి పిండి అని పిలిచే ఈ విగ్రహాన్ని ఒక పల్లకి లో కూర్చునేలా తెల్లని పాల రాతి తో చెక్కారు. టెంపుల్ పడమటి భాగం లో హిందూ దేవతలు భైరవ మరియు హనుమాన్ విగ్రహాలు వుంటాయి. టెంపుల్ ఆవరణ లో ఒక మర్రి చెట్టు కలదు. పిల్లలకు ఇక్కడ వెంట్రుకలు తీసి గుండు చేయిస్తారు.
చిన్తపుర్ని జాతరను 'మాత డా మేలా ' అంటారు. ఇది ప్రతి సంవత్సరం మూడు సారులు జరుగుతుంది. మార్చ్ - ఏప్రిల్ జూలై - ఆగష్టు మరియు సెప్టెంబర్ - అక్టోబర్ లలో నిర్వహిస్తారు. భగవతి చిన్మస్టక సన్నిధిలో ఈ జాతర జరుగుతుంది. నమ్మిక మేరకు ఈ దేవత పురాతనకాలం లో కనపడ కుండా ఈ ప్రదేశంలో వుండేది అని స్థానికులు నమ్ముతారు. ఈ జాతర నవరాత్రులలో తొమ్మిది రోజులు మరియు శ్రావణంలో పది రోజుల పాటు చేస్తారు.