కుట్లేహార్ ఫోర్ట్స్ ను సోలా సిన్ఘి కోటలు అని కూడా అంటారు. కాంగ్రా రాజు సంసార్ చంద్రచే నిర్మించ బడిన ఈ కోటలు సముద్ర మట్టానికి 4500 మీటర్ల ఎత్తులో కలవు. 1809 లో సిక్కు వంశానికి చెందిన మొదటి మహారాజు రంజిత్ సింగ్ దీనిని కొంత పునరుద్ధరించారు. ఈ కోటల సీలింగ్ భాగం అతి పెద్ద రాతి పలకలతో వుంటుంది.
కుట్లేహార్ కోతల ఎత్తుల నుండి గోవింద్ సాగర్ లేక్ అందంగా కనపడుతుంది. కోటకు సమీపంలో రాయపూర్ పాలసు, కుట్లేహార్ అడవులు, బిలాస్ పూర్ , పిప్లు మరియు బంగన ప్రదేశాలు కలవు. ఈ కోటలు బంగన మరియు పిప్లు ల నుండి జరోలా వరకు బస్సు లో చేరవచ్చు.