కుట్టి దేవి దేవి ఆలయం ఉత్తరకాశిలో ఉన్న ఒక పురాతన దేవాలయం. ఆలయ పూజారి మతాధికారులుగా 14 తరం ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ ఆలయంనకు సంబంధం ఒక ఆసక్తికరమైన కథ ఉంది. దాని ప్రకారం ఒకసారి కోటా రాజు గంగోత్రి పుణ్యక్షేత్రం వచ్చినప్పుడు తన డబ్బు సంచిని పోగొట్టుకొనెను. తన ఖర్చులకు డబ్బు లేకపోవుటచే రాజు చాలా కృంగిపోయాడు. మరల రాజు ఉత్తరకాశి తిరిగి వచ్చి విశ్వనాథ్ ఆలయం వద్ద ప్రార్థనలు చేసెను. తన డబ్బు సంచి కనుగొంటే, ఆ గ్రామం నుండి అనువైన అబ్బాయితో తన కుమార్తె వివాహం జరిపిస్తానని వాగ్దానం చేసెను.
చివరకు, డబ్బు సంచి ఆలయ పూజారి కనుగొన్నారు. ఈ రాజు చాలా సంతోషంగా, మరియు అతను తన కుమార్తె కోసం ఒక అనుకూలమైన అబ్బాయిని చూడమని పూజారిని కోరెను. వెంటనే, యువరాణి పూజారి ఎంపిక చేసిన అబ్బాయితో వివాహం జరిగింది. రాకుమార్తె మరియు ఆమె భర్త ఇద్దరు ఒక అనుకూలమైన పరిష్కారం కోసం దేవుడుని ప్రార్ధించారు. తరువాత, దేవత వారి కలలో కనిపించి మరియు ఒక రాయి రూపంలో ఆ క్షేత్రంలో 'ఆమె' ని కనుగొంటారు అన్న విషయాన్ని చెప్పెను. వారి కల తరువాత, రాకుమార్తె మరియు ఆమె భర్త తమ క్షేత్రంలో ఆనందకరమైన పరిమిళాన్నిమరియు మూడు రాళ్ళు కనుగొన్నారు . ఈ రాళ్ళు కనుగొనబడిన చోటులో కుట్టి దేవి ఆలయంను నిర్మించారు.