1)తమ్బెకర్ వాడ
ఈ భవనం వదోదర దివాన్ డి. ప్రస్తుతం పురావస్తు శాఖ దీనిని నిర్వహిస్తోంది. దీనిలో మహాభారత, శ్రీ కృష్ణ జీవతం, ఆంగ్లో మరాఠా వార్ మొదలైన ఘట్టాలకు సంబంధించిన అనేక వాల్ పెయింటింగ్ లు చూడవచ్చు.
2)కీర్తి మందిర్
కీర్తి మందిర్ , 1936 లో గాయక్వాడు లు నిర్మించిన ఒక రాచ సమాధి. దీనిని మహారాజ సాయాజీ రావు తన 75 వ జన్మదినోత్సవం సందర్భంగా నిర్మించారు. ఇక్కడి టవర్ ఒకటి సూర్యుడు, చంద్రుడు, భారత దేశ పటం వంటివి కంచు తో చేయబడి వుంటాయి. ఇక్కడ కల కుడ్య చిత్రాలు మహాభారత మరియు మీరా బయి గాధలు కలిగి వుంటాయి.
3)కుతుబుద్దీన్ హజీరా
కుతుబుద్దీన్ హజీర అనేది కుతుబుద్దీన్ మహమ్మద్ ఖాన్ మరియు అతని కుమారుడు నారంగ్ ఖాన్ ల యొక్క సమాధి. వీరు మొఘల్ చక్రవర్తి అక్బర్ యొక్క సైనికాధికారులు. ఈ సమాధి 1586 లో నిర్మించారు. దీనిలో అందమైన రాతి కిటికీలు ఒక స్టెప్ వెల్ వుంటాయి. నేడు ఇది వదోదర సిటీ లో అతి పురాతన మొఘల్ నిర్మాణం.
4)న్యాయ మందిర్
న్యాయ మందిర్ లో వదోదర్ అ సిటీ సెషన్స్ జిల్లా కోర్టు వుంటుంది. ఈ భవనాన్ని మహారాజ సాయాజీ రావు గాయక్వాడ్ ౩ భార్య చిమ్నాబాయి పేరు పై నిర్మించారు. సెంట్రల్ హాల్ లో మహారాణి విగ్రహం ఒకటి అలంకరించబడి వుంటుంది.