లక్ష్మి విలాస్ పాలస్
లక్ష్మి విలాస్ పాలస్ ను మహారాజ సాయాజీ రావు 1890 లో నిర్మించారు. దీని నిర్మాణాన్ని మేజర్ చార్లెస్ మాంట్ మొదలపెట్టగా, చిసోలిం పూర్తి చేసారు. నిర్మాణం ఇండో సరసునిక్ శైలి లో సాగింది. పాలస్ సందర్సన లో మీరు అనేక కళా కృతులను చూసి ఆనందిస్తారు. ఆ రోజుల లోనే పాలస్ లో ఎలివేటర్ ల సదుపాయం ఏర్పరచారు. దీనిలో అందమైన దర్బార్ హాల్ కలదు. మోతి బాగ్ పాలస్ మరియు మహారాజ ఫతే సింగ్ మ్యూజియం లు కూడా చూడ దగినవే. మహారాజ ఫతే సింగ్ మ్యూజియం లో అనేక రాజ రవి వర్మ పెయింటింగ్ లు కలవు. ఈ మ్యూజియం లో జపాన్, చైనా మరియు ఇటలీ కి చెందినా, మార్బుల్ మరియు కంచు విగ్రహాలు కలవు. పాలస్ చూడాలంటే, ఇక్కడి అధికారుల అనుమతి పొందాలి.
నాజర్ బాగ్ పాలస్ ఈ భవనం ఒక రాజ కుటుంబ నివాసం గా వుండేది. ఈ పాలస్ ను 1721 లో నిర్మించారు. దీనిలో పూర్తి బంగారు మరియు సిల్వర్ ల తుపాకులు కలవు. ఈ పాలస్ లో గాయక్వాడ్ రాయల్ ఫ్యామిలీ కి సంబంధించిన ఆభరాణాలు, స్టార్ ఆఫ్ ద సౌత్ డైమండ్ నెక్లెస్ సహితం కలవు. ఆ నాటి రాచ దుస్తులను సైతం భద్రపరచారు. మకరపుర పాలస్ ఈ భవనం రాచ కుటుంబానికి వేసవి విడిది గా వుండేది. దీనిని మహారాజా ఖేందే రావు 1870 లో ఇటాలియన్ స్టైల్ లో నిర్మించగా దానిని మహారాజ సాయాజీ రావు గాయక్వాడ్ ౩ పునరుద్ధరించారు. ఈ భవనాన్ని ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్సు వారు ట్రైనింగ్ కొరకు ఉపయోగిస్తున్నారు. పాలస్ లోకి ప్రవేశ అనుమతి లేకపోయినా బయటి నుండి అయినా సరే తప్పక చూడదగినది.