అరవిందుడి ఆశ్రం వదోదర లోని దండియా బజార్ లో కలదు. స్వామి అరవిందుడు, మహారాజు సాయాజీ రావు ౩ కు పర్సనల్ సెక్రటరీ గా ఉండేవాడు. బరోడా కాలేజీ లో వైస్ ప్రిన్సిపాల్ గాను మరియు ఇంగ్లీష్ ప్రొఫెసర్ గాను పని చేసాడు. కొంతకాలం స్వాతంత్ర యోధుడి గా పోరాడి, తర్వాత జీవితం లో ఒక యోగి గా మారి ఆశ్రమాన్ని స్థాపించాడు. ఈ ఆశ్రమం అన్ని మతాల వారికి ప్రవేశ అనుమతిని ఇస్తుంది.