సాయాజీ బాగ్ లోని రెండు మ్యూజియం ల లోను ఒకటి వదోదర మ్యూజియం . ఈ మ్యూజియాన్ని మహారాజ సాయాజీ రావు ౩ 1894 లో నిర్మించారు. ఈ మ్యూజియం లో టూరిస్టుల సందర్శనకు జపాన్, టిబెట్, నేపాల్, ఈజిప్ట్ దేశాల నుండి సేకరించిన వివిధ వస్తువులు, ప్రపంచ దేశాల వివిధ నాణెములు, వివిధ సంగీత పరికరాలు, పెయింటింగ్ లు ఉంచారు. గుజరాత్ యొక్క చారిత్రక వైభవాన్ని ప్రదర్శించే అంశాలు కూడా కలవు.