కురిసుమల ఆశ్రమం కురిసుమల కొండపై ఎత్తుగా ఉంటుంది. ఈ ఆశ్రమం నజరాణి కేధలిక్కులకు మరియు గాంధీ ఫిలాసఫీని నమ్మేవారికి ఇది చాలా పవిత్రమైనది. పేరుకు తగ్గట్లు మౌంటెన్ ఆఫ్ ది హోలీ క్రాస్ అంటారు. ఈ ఆశ్రమాన్ని అన్ని మతాలు, కులాల వారు సందర్ఇస్తారు. ఇక్కడ గుడ్ ఫ్రై డే వేడుకలు బాగా నిర్వహిస్తారు. ఈ సమయంలో యాత్రికులు చెక్క శిలువలు ధరించి కొండ ఎక్కుతారు. ఈ ఆశ్రమం దాన ధర్మాలకు ప్రసిద్ధి. ఎంతోమంది ఆకలిగొన్న వారిని ప్రతిరోజూ పోషిస్తుంది. ఆశ్రమంలోని నివాసితులును లేదా అతిధులను ఆహార పదార్ధాలు వేస్ట్ చేయనివ్వరు. ఈ ఆశ్రమంలో పెద్ద ప్రార్ధనా స్ధలం కలదు. భక్తులు, ప్రార్ధించటం లేదా ధ్యానం చేయటం చేస్తారు.
చర్చి చర్చి సమీపంలో అనేక పాల ఉత్పత్తి కేంద్రాలు కలవు. ప్రతిరోజూ సుమారు 1500 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ కురితెచల కొండపై 12 గుట్టలు కలవు. బాగా ఎత్తుకలిగి వుండేది రిసరెక్షన్ గార్డెన్ గా చెపుతారు. ఆధ్యాత్మికతలే కాక, దానికి గల అందమైన సరస్సులు, తోటలు వంటివి ఉండటం చేత ఈ ప్రదేశం ఒక పర్యాటక ప్రదేశంగా కూడా పేరు తెచ్చకొంది.