గణపతి ఆలయం లేదా చిట్టి వినాయగర్ ఆలయం వల్పరై నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దీనిని జయశ్రీ టీ ఇండస్ట్రీస్ యాజమాన్యం నిర్వహిస్తుంది. ఈ గణపతి విగ్రహం వద్ద ముంబై "సిద్ధి వినాయకుడు ఆలయం" లో జరిగే పూజల వలె పూజలు చేస్తారు.
గణపతి ఆలయం వద్ద ఉన్న విగ్రహంనకు మరొక ఆసక్తికరమైన అంశం ఉంది. అది ఏమిటంటే పూర్తిగా ఏక పాలరాయి నుండి చెక్కబడింది. ఈ ఆలయం టీ సేద్యాలు మద్య ఉన్నది. ఈ ఆలయం వల్పరైలో ఉన్న బాలాజీ ఆలయంను పోలి ఉంటుంది. ఈ ఆలయం సందర్శించిన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నిర్మలమైన కొండలు మరియు చెట్టు పెంపకం నేపద్యం ఉన్న ఈ ఆలయ వాతావరణం అలసిన వారికీ విశ్రాంతిని ఇస్తుంది.