వల్సాడ్ ఒక తీర ప్రాంత జిల్లా. దాని పేరు వడ్-సాల్ నుండి వచ్చింది. అనగా మర్రి చెట్లు (వడ్) చేత చిక్కులబడ్డ ప్రదేశం అని అర్ధం. ఈ ప్రాంతం మర్రి చెట్లతో పూర్తిగా నిండి ఉంది. వల్సాడ్, సంజన్ రేవు గుర్తించక ముందు పార్సీలు అడుగుపెట్టిన మొదటి ప్రదేశం. వల్సాడ్ అరేబియా సముద్రం, నవసారి మరియు డాంగ్ జిల్లాలు మరియు మహారాష్ట్ర రాష్ట్ర సరిహద్దులుగా ఉంది.
టీతల్ సాగరతీరం, స్వామి నారాయణ్ ఆలయం, సాయి బాబా ఆలయం, శాంతిధాం ఆలయం, పర్నేరా కోట, తడకేశ్వర్ మహదేవ్ మందిర్ వల్సాడ్ లోని కొన్ని ముఖ్యమైన పర్యాటక స్థలాలు. పైకప్పు లేని కారణంగా సూర్యకాంతి నిరంతరం శివలింగం తాకుతూ ఉండటం వల్ల తడకేశ్వర్ ఆలయానికి ఆ పేరు పెట్టారు. ఈ ఆలయం వివిధ రకాల శివలింగాలకై ప్రసిద్ధి చెందింది. పర్నేరా కోట ఛత్రపతి శివాజీ నిర్మించాడు. పర్నేరా కొండ, ప్రతి అక్టోబర్ లో ఇక్కడ నిర్వహించే ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. టీతల్ సాగరతీరం నల్లటి ఇసుకకై ప్రఖ్యాతి గాంచింది. వల్సాడ్ పోలీసు ప్రధాన కార్యాలయం లో ఒక చారిత్రక జైలు ఉంది.
వల్సాడ్ స్థానికంగా హాఫుస్ అని పిలువబడే ఆల్ఫాన్సో మామిడికి కూడా ప్రసిద్ధి చెందింది. వల్సాడ్ రైలు ద్వారా ముంబై, అహ్మదాబాద్, కాన్పూర్ వంటి ముఖ్యమైన నగరాలతో అనుసంధానం కలిగి ఉంది. వల్సాడ్ లోపల, వివిధ పర్యాటక ప్రదేశాలు చేరుకోవడానికి బస్సులు మరియు ఆటో రిక్షాలు అందుబాటులో ఉన్నాయి.