దండి గుజరాత్లో నవసారి నగరం దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామము. ఇది మహాత్మా గాంధీ యొక్క ఉప్పు సత్యాగ్రహం లేదా దండి యాత్రకు ప్రసిద్ధి చెందిన చారిత్రక నగరం. 1930వ సంవత్సరం లో, అనుచరులతో కలిసి మహాత్మా గాంధీ ఉప్పు పన్ను విధింపుకు వ్యతిరేకంగా, అహ్మదాబాద్ నుండి దండి తరలివచ్చారు.