ప్రముఖంగా బి హెచ్ యు అని పిలువబడే బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రముఖ దేశభక్తుడు, సంఘ సంస్కర్త, విద్యావేత్త, భారతదేశ రాజకీయ కార్యకర్త అయిన పండిట్ మదన్ మోహన్ మాల్వియ అంకితభావ చర్యల వల్ల దీని పుట్టుక ఋణపడిఉంది.
ఈ విశ్వవిద్యాలయ పునాది రాయి అప్పటి వైస్రాయి లార్డ్ హార్డింగ్, 1916 వ సంవత్సరం ఫిబ్రవరి 4 న వేయడం జరిగింది. ఇరవైవేల కంటే ఎక్కువమంది విద్యార్ధులతో, అరవై కంటే ఎక్కువ వసతిగ్రుహాలతో, ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయంగా పరిగణించబడుతుంది. నిజానికి దీనిని ఒకప్పుడు ‘ఆక్స్ఫార్డ్ ఆఫ్ ఈస్ట్’ అని పిలిచేవారు.
ప్రధాన ప్రాంగణం 1300 ఎకరాలకంటే ఎక్కువ ఉంటుందని అంచనా. ఈ భూమిని వారణాసి పాలకుడు విరాళంగా అందించాడు. మిర్జాపూర్ జిల్లలో బర్కచ్చ అని పిలవబడే మరో ప్రాంగణం ఉంది, ఇది నగరం నుండి షుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కాంపస్ ని రాజీవ్ గాంధీ దక్షిణ కాంపస్ అంటారు. ఈ విశ్వవిద్యాలయంలో 14 బోధనా సిబ్బంది, 140 విభాగాలతో కూడిన నాలుగు ప్రధాన సంస్థలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోని 34 కంటే ఎక్కువ దేశాల నుండి విద్యార్ధులను ఆకర్షిస్తుంది.