భారతదేశం అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆలోచనతో, హయ్యర్ టిబెటన్ స్టడీస్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ (సి ఐ హెచ్ టి ఎస్) దలైలామాను సంప్రదించిన తరువాత 1967 లో ఏర్పాటు చేశారు.
హయ్యర్ టిబెటన్ స్టడీస్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ప్రవాస భారతీయులు యువ పురుషులు, మహిళల విద్యకోసం, హిమాలయాల సమీపంలోని సరిహద్దు ప్రాంతంలోని వారికోసం కూడా స్థాపించబడింది.
ఈ ఇన్స్టిట్యూట్ ఇంతకుముందు కేవలం విద్య మంత్రిత్వ శాఖ, సంస్కృతి శాఖ వారి కింద స్వాదికార విద్యా సంస్ధగా ఉండేది, 1988 లో భారత ప్రభుత్వ అంగీకారంతో నిర్ణయాధికార విశ్వవిద్యాలయం హోదా పొందింది.
భారతదేశంలోని అనేక రకాలలో ఒకటైన ఈ విశ్వవిద్యాలయం, విద్య, బుధోలజీ, టిబెటాలజీ, హిమాలయన్ విద్యలలో పరిశోధనపై దృష్టిపెడుతుంది. జాతీయస్థాయి ప్రాధాన్యం గల సంస్థగా ఇది గుర్తింపు పొందింది, నేషనల్ అసెస్మెంట్ & అక్రేడిటేషన్ కౌన్సిల్ – ఎన్ ఏ ఏ సి వారి నుండి విద్యారంగంలో అత్యుత్తమ సేవలకు గాను ఐదు నక్షత్రాల హోదాను పొందింది.
శాంతరక్షిత లైబ్రరీలో పుస్తకాలు, అచ్చు ప్రతులు, భారతీయ, బౌద్ధ సాహిత్యంలో అరుదైన రచనలు, అనువాదాలు, సమగ్ర చిత్రపటాల సేకరణలు ఉన్నాయి.