దుర్గా మాతకు అంకితం చేసిన దుర్గా ఆలయం వారణాసి లోని రామనగర్ లో ఉంది. ఈ ఆలయాన్ని 18 వ శతాబ్దంలో బెంగాలీ మహారాణి నిర్మించారని నమ్ముతారు, ప్రస్తుతం ఈ ఆలయం బనారస్ రాజ కుటుంబం అధీనంలో ఉంది.
ఈ ఆలయం ఉత్తర భారత నిర్మాణశైలి నగర శైలిలో నిర్మించారు. ఇది దుర్గా కుండ్ అని పిలవబడే కొలను ఎదురుగా ఒక చదరపు పునాదిపై నిలవబడి ఉంది. ఈ ఆలయం నాలుగు మూలల్లో ప్రతిదీ ఎత్తైన గడియార స్తంభాలు, బహుళ అంతస్తుల గోపురం లేదా శిఖరాలను కలిగిఉంది. దేవత ధరించిన దుస్తుల లాగానే భవనానికి కూడా కాషాయ రంగు వేసారు.
దుర్గా దేవత మనవ నిర్మితం కాకుండా, స్వయంభూగా వెలిసిన ఈ విగ్రహం క్షుద్ర శక్తుల నుండి ఈ నగరాన్ని రక్షిస్తుందని నమ్మకం.
నవరాత్రి, ఇతర పండుగల సమయంలో వేలమంది భక్తులు ఈ ఆలయానికి వస్తారు. దురదృష్టవశాత్తూ, హిందువులు కానివారిని ఆలయ ప్రాంగణంలోనికి మాత్రమే రానిస్తారు, గర్భగుడిలోకి రానివ్వరు. ఈ ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో వానరులు ఉంటాయి కాబట్టి ఈ ఆలయాన్ని కోతి ఆలయం అని కూడా పిలుస్తారు.