శివుడికి అంకితం చేసిన కొత్త విశ్వనాధ ఆలయ కూడా బనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపించిన పండిట్ మదన్ మోహన్ మాలవియా ఆలోచనే. 252 అడుగుల పొడవైన ఈ మందిర పునాదిరాయిని 1931 మార్చ్ లో వేసారు, ఇది పూర్తికావడానికి మూడు దశాబ్దాలు పట్టింది.
తెల్లని చలువరాళ్ళతో నిర్మించిన ఈ ఆలయం ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆలంగిర్ చే నాశనం చేయబడిన కాశీ లోని అసలు విశ్వనాధ ఆలయానికి ఖచ్చితమైన నకలు.
కొత్త విశ్వనాధ ఆలయం ఒక పెద్ద ప్రాంగణం. ఇందులో వివిధ దేవీ దేవతలకు చెందిన ఏడు ఆలయాలు ఉన్నాయి. అయితే ఈ ఆలయ నేలపై ఉన్న అంతస్తులో శివుని విగ్రహం ఉంది, లక్ష్మీ నారాయణ, దుర్గా ఆలయాలు మొదటి అంతస్థులో ఉన్నాయి.
తెల్లని చలువరాయితో చేయబడిన పొడవైన శిఖరం ఈ ఆలయ విశిష్ట లక్షణం. ఈ ఆలయ గర్భగుడిలో ఒక శివలింగం ఉంది. ఈ ఆలయ లోపలి గోడలు గీతలోని ముఖ్యమైన అంశాలతో చిత్రీకరించబడి ఉన్నాయి, ఇతర అంశాలు స్పష్టమైన ద్రుష్టా౦తాలతో చెక్కబడి ఉన్నాయి.
ఈ ఆలయం పండిట్ మదన్ మోహన్ మాల్వియా విస్తారమైన అంచనాలకు అనుగుణంగా అన్నిరకాల కులాలు, మతాల ప్రజల కోసం తెరవబడి ఉంటుంది.