రానా మహల్ ఘాట్ పేరును సూచించిన విధంగానే 1670 లో రాజ్పుత్ నాయకుడు అయిన ఉదయ్ పూర్ మహారాణా నిర్మించారు. ఇది దర్భాంగా ఘాట్ మరియు చౌసైతి ఘాట్ మధ్య ఉన్నది. దశస్వమేత్ ఘాట్ కు దక్షిణ వైపున ఉంది. ఈ ఘాట్ నిర్మాణం రాజ్పుత్ శైలిలో ఉంటుంది.ఇది ప్యాలెస్ నివాసంగా ఉంది. ఉదయ్ పూర్ రాణా జగత్ సింగ్ పునరుద్ధరించారు.
రాజభవనం యొక్క గోధుమ నిర్మాణం యొక్క అడుగు భాగం వద్ద ఘాట్ ఉన్నది. ఘాట్ యొక్క దాని పైభాగంలో నిర్మించబడిన అద్భుతమైన పుణ్యక్షేత్రం ప్రధాన ఆకర్షణగా ఉంది.
ఘాట్ ను 2008-2009 లో పునర్నిర్మాణం చేసారు. అంతే కాకుండా పునర్నిర్మాణం కోసం ప్రాంతీయ పర్యాటక శాఖ చొరవ తీసుకున్నారు. వారణాసి యొక్క పునరుజ్జీవనం కోసం పునరుద్ధరణ ప్రాజెక్టులో చేర్చారు. పిల్లలు మరియు పెద్దలు ఈత కొట్టటానికి వేసవిలో ఇక్కడకు వస్తారు. ఘాట్ లో రాత్రి సమయంలో దయ్యాలు ఉంటాయని ఒక కథ ప్రచారంలో ఉన్నది.