జనార్ధనస్వామి దేవాలయం వైష్ణవ మతస్తులది. సుమారు 2000 సంవత్సరాల కిందటిది. ఈ గుడి పాపస్నానం బీచ్ సమీపంలో ఉంటుంది. ఈ గుడిలో డచ్ ఓడ కు చెందినా కెప్టెన్ ఒకరు బహుకరించిన పెద్ద గంట కలదు. ఇది పర్యాటకులకు ఒక ఆకర్షణ.
ఈ గుడిలో విష్ణుమూర్తి ప్రధాన దైవం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆరాట్టు పండుగ చేస్తారు. ఈ పండుగ మీన మాసం లో పది రోజులపాటు నిర్వహిస్తారు. వేలాది భక్తులు ఆరాట్టు పండుగకు హాజరవుతారు. హిందువులు కాని వారిని దేవాలయంలోకి ప్రవేశం ఇవ్వరు. హిందువులు ఇక్కడ వారి పూర్వీకులకు మతపర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడి కొలనులో నీరు పవిత్రమైనది అని ఆ నీటిలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని భావించి ఆచరిస్తారు. దేవాలయం దక్షిణ భారత శిల్పశైలి లో కట్ట బడింది. ఇది వర్కాల రైలు స్టేషన్ కు 3 కి.మీ. దూరంలో వుంటుంది.