వర్కాలలో కల శివగిరి మఠం కేరళలో ప్రసిద్ధి చెందిన మఠాలలో ఒకటి. ఇది శ్రీ నారాయణ గురు పేరుపై కట్టిన సమాధి. ఈ గొప్ప వ్యక్తి ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దైవం అనే సిద్ధాంతాన్ని బోధించాడు. దీనిని 1904 లో నిర్మించారు. అప్పటి నుండి వేలాది భక్తులు దీనిని దర్శించారు. ప్రతి ఏటా డిసెంబర్ 30 నుండి జనవరి 1వ తేదీ వరకు గల శివగిరి యాత్రకు వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఈ మఠంలో వివిధ మతపర, సాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఏటా గురు జయంతి మరియు సమాధి ఉత్సవాలు నిర్వహిస్తారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సెమినార్లు, బహిరంగ సమావేశాలు జరుపుతారు. ఈ మఠం ఉదయం 5. 30 గం. నుండి మ.. 12 గం. వరకు మరియు సా. 4.30 గం. నుండి 6.30 గం. వరకు తెరచి వుంటుంది. శివగిరి మఠం పట్టణం నుండి 3 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇది సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో కలదు.