ఈ దేవాలయం విదిశ నుండి 84 కి. మీ. దూరంలో ఉన్నది, కాని విదిశ నుండి దేవాలయానికి సులభంగా చేరుకోవొచ్చు. విదిశ నుండి పతారికి రోజువారి బస్సులు అందుబాటులో ఉన్నాయి, వీటిద్వారా ప్రయాణికులు ఈ గడర్మల్ దేవాలయాన్ని చేరుకోవొచ్చు. పతారి పట్టణంలో అనేక ఇతర మధ్యయుగకాలంనాటి దేవాలయాల శిధిలాలు ఉన్నాయి. ఇది ఎత్తులో ఉండటంవలన, దీనిని దూరం నుండి కూడా చూడవొచ్చు.
ఈ ఆలయం రెండు భాగాల కట్టడాలుగా కనపడుతుంది ఎందువలనంటే దీనికి రెండు వేర్వేరు నేలమాళిగలను కలిగి ఉన్నది. అంతేకాక, ఈ రెండు వేర్వేరు నేలమాళిగలు రెండు వేర్వేరు కాలాలకు చెందినవిగా కనిపిస్తాయి. ఈ ఆలయం 9వ శతాబ్దం AD.నాటిదని భావిస్తారు. ఈ ఆలయ నిర్మాణంలో శిథిలమైన జైన్ మరియు హిందూ దేవాలయాల ముక్కలను ఉంచి కట్టారని భావిస్తారు.
ఇక్కడ ప్రార్థనల కొరకు ప్రధాన హాలు లేకుండా ఒక ప్రవేశ వాకిలి ఉన్నది. ఈ ఆలయం, గ్వాలియర్ నగరంలోని "తెలి కా మందిర్" ను గుర్తుకు తీసుకు వొస్తుంది. ఈ ఆలయం చుట్టూ శిథిలమైన ఏడు ఇతర విగ్రహాలు ఉన్నాయి.