పవిత్రమైన గంగా నది ఒడ్డున కల విన్ధ్యచల్ ఇండియా లో ఒక ప్రధాన శక్తిపీఠం. హిందూ పురాణాల మేరకు ఈ పీఠం మాత దుర్గా దేవి నివాసంగా చెపుతారు. మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన తర్వాత ఈ దేవత విన్ధ్యన్చల్ ప్రదేశాన్ని తన నివాసంగా ఎంపిక చేసుకొంది. వైభవో పేత రోజులలో విన్ధ్యాన్చల్ లో అనేక టెంపుల్స్, ఇతర స్మారకాలు ఉండేవి. కాని వీటిని అన్నింటినీ మొఘల్ చక్రవర్తి ఔరంగ్ జేబ్ విధ్వంశం చేసాడు. అయినప్పటికీ, నేటికి వాటిలో కొన్ని మిగిలి వున్నాయి.
దేవాలయాలు, ప్రకృతి దృశ్యాలు విన్ధ్యాన్చల్ హిందువులకు పవిత్ర పుణ్య క్షేత్రం. ఈ ప్రదేశం విక్టోరియన్ కాలం నాటికి చెందినా అనేక అందమైన భవనాలు కల మీర్జాపూర్ జిల్లాలో కలదు. ఇక్కడ కల ప్రకృతి అందాలు వాటికి మరొక ఆకర్షణగా వుంటాయి. ఈ ప్రదేశం లో అనేక పచ్చటి అడవులు కూడా కలవు. అందమైన దేవాలయాలు, సుందర పరిసరాలు విన్ధ్యాన్చల్ ను ఒక మంచి పర్యాటక ప్రదేశం గా తీర్చి దిద్దాయి. విన్ధ్యాన్చల్ చుట్టుపట్ల కల ఆకర్షణలు విన్ధ్యాన్చల్ లో అనేక ఆకర్షణలు కలవు. వాటిలో రామాయణ కాలం నాటి సీతా కుండ్ అనే కొలను , పురాతన కాళీ టెంపుల్, రాముడు ప్రతిష్టించిన శివ లింగం కల రామేశ్వర్ మహాదేవ టెంపుల్ , అష్టభుజ దేవి టెంపుల్ ప్రధానమైనవి.
విన్ధ్యన్చల్ దేవి పేరుతో విన్ధ్యావాసిని దేవి టెంపుల్ నిర్మించారు. విన్ధ్యావాసిని పుట్టిన రోజు వేడుకగా విన్ధ్యవాసిని జయంతి సమారొహ్ పండుగ చేస్తారు.
విన్ధ్యాచల్ ఎలా చేరాలి ? విన్ధ్యాచల్ కు రోడ్డు, రైలు, వాయు మార్గాలు కలవు.
విన్ధ్యాచల్ సందర్శనకు మంచి సమయం అక్టోబర్ నుండి మార్చ్ వరకు.