రామేశ్వర్ మహాదేవ టెంపుల్ విన్ధ్యన్చల్ లోని రామ్ గయా ఘాట్ లో కలదు. ఇది విన్ద్యవాసిని దేవి టెంపుల్ కు ఒక కి. మీ. దూరం మరియు మిర్జాపూర్ కు ఎనిమిది కి. మీ. ల దూరం లో వుంటుంది. ఇక్కడ శ్రీరాముడు తన పూర్వీకుల కొరకు శివుడి ని పూజించాడని చెపుతారు. వారి జ్ఞాపకార్ధం ఇక్కడ ఒక శివ లింగాన్ని ప్రతిష్టించాడని చెపుతారు.
ఈ టెంపుల్ విన్ధ్యావాసిని దేవి మరియు అష్టభుజ దేవి టెంపుల్ ల మధ్య వుంటుంది. ఈ మూడు దేవాలయాలను కలిపి మహాత్రికొనే అంటారు. భక్తులు మూడు గుడులకు కలిపి ప్రదక్షిణ చేస్తారు. శ్రీరాముడు తన పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు ఆచరించి ఈ దేవాలయాలను దర్సిన్చాడని, అదే విధంగా లక్ష్మణుడు కూడా ఇక్కడ లక్ష్మనేశ్వర్ మహాదేవ టెంపుల్ కట్టాడని చెపుతారు.