సీతా కుండ్ అనే ఈ సరస్సు విన్ధ్యాచల్ లోని మని పర్వతం మరియు విద్యా కుండ్ లకు సమీపం లో ఒక చిన్న కొండపై కలదు. ఇది రామాయణ కాలం నాటిది. రావణుడి ని వధించిన తర్వాత శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడు లంక నుండి తిరిగి వస్తున్నపుడు సీత కు దాహం వేయగా లక్ష్మణుడు తన బాణం భూమి లోకి వేసి నీరు పైకి తెప్పించిన ప్రదేశం సీతా కుండ్ గా చెపుతారు.
సీతా కుండ్ నిరంతరం నీటి ప్రవాహం కలిగి వుంటుంది. ఈ నీటిని పవిత్ర నీరు గా భావిస్తారు . స్థానికులు, యాత్రికులు అధిక సంఖ్యా లో సందర్శిస్తారు. ఈ నీటి బుగ్గ చేరాలంటే 48 మెట్లు ఎక్కాలి. ఇక్కడే హనుమాన్, రాం, జానకి మరియు దుర్గ దేవి టెంపుల్స్ కూడా కలవు . చౌరాసి పరికర్మ, శ్రావణ, రామనవమి పండుగలు ఘనంగా నిర్వహిస్తారు.