విన్ధ్యావాసిని దేవి టెంపుల్ ఉత్తర ప్రదేశ్ లోని మిర్జాపూర్ జిల్లాలో కల విన్ధ్యాన్చల్ టవున్ లో కలదు. పురాణాల మేరకు ఈ దేవత దుర్గా దేవి అవతారం. ఈ శక్తి పీఠం ను హిందూ భక్తులు పరమ పవిత్రం గా భావిస్తారు. విన్ధ్యావాసిని దేవిని స్థానికులు కాజాల దేవి అని ప్రేమగా పిలుస్తారు.
విన్ధ్యవాసిని దేవి టెంపుల్ విన్ధ్యన్చల్ సిటీ లోని ఒక బిజీ బజార్ మధ్యలో కల ఒక అతి పెద్ద భవనం లో కలదు. ఈ దేవత ఒక సింహం పై కూర్చుని దర్శనమిస్తుంది. విగ్రహం నల్ల రాతి తో చేయబడింది. ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో దాంధ్వజ దేవి, పన్నెండు చేతుల దేవి మరియు మహాకాళి , మరికొన్ని శివ లింగాలు కూడా వుంటాయి. ఒక సప్తసతి మండపం కూడా వుంటుంది.
ఈ టెంపుల్ లో నవరాత్రి , అశ్విన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.