భద్రకాళి దేవాలయం మన దేశంలో ఉన్న పురాతనమైన గుడులలో ఒకటి. ఇది భద్రకాళి దేవతకు అంకితం చేయబడింది. దీనిని 625 ఏ.డి లో చాళుక్య రాజవంశం యొక్క రాజు పులకేసి II నిర్మించారు అని భావిస్తున్నారు, ఇది భద్రకాళి సరస్సు ఒడ్డున ఉంది. .హిందూ మత పురాణాల ప్రకారం, దేవత భద్రకాళి (లేదా కాళి) ని, తల్లి దేవతగా కొలుస్తారు మరియు ఈ దేవతను ఎనిమిది చేతుల్లో ఆయుధాలతో అలంకరించటం చూడవొచ్చు.
అల-ఉద్ దిన్ ఖిల్జీ మరియు అతని వారసులు పాలనా సమయంలో, ఆలయం శిథిలావస్థలో పడింది కాని, మరల నవీకరణ పనులు 20 వ శతాబ్దం మధ్య భాగంలో పూర్తి చేసారు.చాళుక్య రాజుల నిర్మాణ శైలి చూపే ముఖ్యమైన కట్టడాలలో ఒకటిగా ఉంది.
గుడి చుట్టూ ఉన్న సహజమైన రాళ్ళు మరియు సూర్యాస్తమయంలో కనిపించే ప్రకృతి సౌదర్యాన్ని చూడవలసిందే.