వేయి స్తంభాల గుడి ఒక చారిత్రాత్మక హిందూ ఆలయం, ఇక్కడ విష్ణువు, శివుడు మరియు సూర్యుడు మొదలైన దేవతలు ఉన్నారు. కాకతీయ రాజు, రుద్ర దేవ 1163 ఏ.డి. లో దేవాలయం నిర్మించాడు మరియు ఈ మతపరమైన నిర్మాణానికి దివ్యంగా చెక్కబడిన వెయ్యి స్తంభాలును ఉపయోగించారు కాబట్టి దీనికి వేయి స్తంభాల గుడి అనే పేరు వొచ్చింది.
ఈ గుడిలో ఆకట్టుకునే తలుపులు, పైన పేర్కొన్న వేయి స్తంభాలు మరియు శిల్ప కళతో ఉన్న ఆలయ పైకప్పులు-వరంగల్ యొక్క సందర్శన స్థలాలో ఒకటిగా నిలిచింది. వెనకాల ఉన్న హనుమకొండ కొండలు ఈ ఆలయ అందానికి ప్రతీకగా నిలిచాయి. ప్రవేశద్వారం వద్ద ఉన్నఅతిపెద్ద నంది, అత్యంత పాలిష్ చేసిన నల్ల అగ్గిరాయి ఏకశిలా విగ్రహం నుండి చెక్కబడినది అని నమ్ముతారు.
వేయి స్తంభాల గుడి కాకతీయ రాజులకు ఉన్నశిల్పకళా తృష్ణకు ఒక ప్రతీక అని చెప్పవొచ్చు మరియు ఇది దక్షిణ భారతంలోనే చాల పురాతనమైనదని చెప్పవొచ్చు.