వార్ధాలోని మగన్వాడి లో మగన్ సంగ్రహాలయ అనే మ్యుజియం ఏర్పాటుచేసారు. సెంటర్ ఆఫ్ సైన్స్ కు దగ్గరగా ఉన్న ఈ మ్యూజియం 1938 డిసెంబర్ 30 న మహాత్మాగాంధీ చే ప్రారంభించబడింది. గాంధీ ఆర్ధిక విధాన౦లొ నిపుణులైన ఆర్యనాయకం, డాక్టర్. జే.సి,కుమారప్ప ఈ మ్యూజియాన్ని అభివృద్ది చేసారు.గ్రామీణ పరిశ్రమలు, డైరీ, వ్యవసాయం మొదలైన వాటి గురించి పరిశోధన, అభివృద్ది పై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ మ్యూజియం ఏర్పాటుచేయబడింది. ఇక్కడ స్థానిక గ్రామీణ కళాకారులచే రూపొందించబడిన అనేక రకాల ఖాదీ, చర్ఖాలు, హస్త కళలు, స్వదేశీ ఉద్యమాన్ని వ్యాపింప చేయడానికి వాడిన పద్ధతులు తెలుస్తాయి.