యమునా నగర్ వద్ద, చుహర్పూర్ గ్రామ సమీపంలో ఉన్న చౌదరి దేవి లాల్ హెర్బల్ నేచర్ పార్కు పరిశోధన కేంద్రంగా పేరుగాంచింది, ఇక్కడ అనేక రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. 2001 నవంబర్ 6 న ఏర్పాటుచేయబడిన ఈ పార్కు ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు ఔషధ మొక్కలని, మూలికాలని అందిస్తుంది. ఈ నేచర్ పార్కు హర్యానా లోని హిమాలయాల లోని శివాలిక్ శ్రేణుల సమీపంలో కనిపిస్తాయి.
షుమారు 184 ఎకరాలలో ఉన్న ఈ చౌదరి దేవి లాల్ హెర్బల్ నేచర్ పార్కులో పెరిగే ఔషధ మొక్కలు, మూలికలు, పొదలు, తీగలు, నీటి మొక్కలు 300 రకాలకు పైగా ఉన్నాయి. ఈ పార్కుని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం అనేక ప్రయోజనాలు ఉన్నాయని నమ్మి స్థానిక ఔషధ, సుగంధ మొక్కలను పునరుద్ధరించడం.
అశ్వగంధ, సఫేద్ ముసలి, సర్పగంద, వాచ్, బ్రాహ్మి, చిత్రాక్, ఇసాబ్గోల్ వంటి ఆయుర్వేద మొక్కలతోపాటు ఖైర్, టేకు, శిషం, సింబల్ వంటి మొక్కలు, చెట్లు ఉన్నాయి. ఈ హెర్బల్ నేచర్ పార్క్ వద్ద తులసి, పిప్పలి, మకోయ్, భూమి అమలకి, బహేరా, గ్వర్పత, హర్డ్, ఆమ్ల, బేల్, కలిహరి, హల్ది, నిమ్మగడ్డి, అతిమధురం, జట్రోఫ, పల్మరోస వంటివి కూడా చూడవచ్చు.
చౌదరి దేవి లాల్ హెర్బల్ ప్రకృతి పార్క్ సందర్శకులు ఔషధ మూలికల వివరణలు బోర్డుల ఉంచడం వల్ల వాటిని గురించి మరింత సులభంగా తెలుసుకోవచ్చు. అదనంగా ఈ నేచర్ పార్క్ లో పిల్లల పార్కు, వెదురు కాటేజ్ లు ఉన్నాయి, ఈ పార్క్ లో సమాచార కేంద్ర కూడా ఉంది.