మహారాష్ట్ర లోని యావత్మల్ జిల్లాలో ఈశాన్యం వైపు ఉండే చిన్న గ్రామం యావత్మల్. సముద్ర మట్టానికి 1460 అడుగుల ఎత్తున విదర్భ ప్రాంతంలో ఉండే ఈ గ్రామం చుట్టూ చంద్రపూర్, పర్భని, అకోలా, అమరావతి జిల్లాలు ఉన్నాయి.
మరాఠీ లో యావత్ అంటే పర్వతం, మాల్ అంటే వరుస. ఈ రెండు పదాల కలయికతో యావత్మల్ అనే పేరు వచ్చింది.
చారిత్రక ప్రాధాన్యం
చరిత్ర పుటల్లో ప్రసిద్దికెక్కిన అన్ని రాజ వంశాలు యావత్మల్ ని పరిపాలించి దాని అభివృద్ధిని, సంస్కృతిని తమదైన రీతిలో ప్రభావితం చేసారు.
యావత్మల్ గా పేరుపడక ముందు, ఈ ప్రాంతాన్ని యవతేచా మహల్ అని, యోత్-లోహార్ అని పిలిచేవారు. ఆ రోజుల్లో బేరార్ దక్కన్ సుల్తనత్ లో యావత్మల్ ప్రధాన పట్టణం. అహ్మద్ నగర రాజుల నించి ముఘలాయిలు ఈ పట్టణాన్ని చేజిక్కించుకోగా చివరి ముఘల్ చక్రవర్తి మరణం తరువాత మరాఠా రాజులూ యావత్మల్ ను కైవసం చేసుకున్నారు. చివరగా బ్రిటీష్ వారు దీనిని తమ రాజ్యంలో కలుపుకున్నారు. మొదట్లో మధ్య భారతంలోని ప్రధాన నగరంగా గుర్తించబడిన ఈ పట్టణం అనంతరం మహారాష్ట్ర లో చేరింది.
ఇక్కడ ఉన్నపుడు ఏమి చూడాలి
యావత్మల్ పాత దేవాలయాలకు, అందమైన విహార కేంద్రాలకు ప్రసిద్ది. నృసింహాలయం, దత్త మందిరం, కలంబ్, ఖతేశ్వర్ మహారాజ్ దేవాలయం ఇక్కడి యాత్రా స్థలాలకు ఉదాహరణలు. యావత్మల్ లో జగత్ మందిరం, ఖోజోచి మసీదు కూడా వున్నాయి.
యావత్మల్ దగ్గరలోని కలంబ్ అనే గ్రామం పురాతన భూగర్భ చింతామణి వినాయకుడి విగ్రహానికి ప్రసిద్ది. దగ్గరలోనే గణేశ కుండం అనే పవిత్ర జలాశయం వుంది.
పైనగంగా అభయారణ్యం, తిపేశ్వర్ అభయారణ్యం ప్రకృతి, వన్యప్రాణి ప్రేమికులకు ఆహ్లాదం కలిగిస్తాయి.
యావత్మల్ సందర్శించడానికి శీతాకాలం సరైన సమయం కాగా, ఇక్కడికి వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.