ప్రభుత్వ మూలికల క్షేత్రం పుగానూర్ సరస్సు కి సమీపంలో ఉంది. ఇది అటవీ శాఖ వారిచే నిర్వహించబడుతుంది, ఇది ఆయుర్వేద మందులు, సిద్ధ లో ఉపయోగించే మొక్కలు, అనేక అరుదైన మూలికలకు నిలయం. ఔషధ గుణాలు కలిగి ఉండడం వల్ల, ఈ మొక్కలు వ్యాపార అవసరాల దృష్ట్యా వైద్యపరమైన ఉపయోగం కోసం సాగుచేయబడుతున్నాయి. ప్రభుత్వ పండ్ల క్షేత్రాలు అతనవూర్, నిలవూర్ వద్ద ఉన్నాయి. ఇవి నిజానికి, బేర్ పండ్లు, పూలు కలిగిన అనేక రకాల మొక్కలు, చెట్లు ఉన్న బొటనికల్ గార్దేన్లు. ఈ బొటనికల్ గార్డెన్ల మధ్య దారి అందం, వాసన, తియ్యని పండ్లు మీ భావాలకు ఉపశమనాన్ని కలిగిస్తాయి.