స్వామిమలై హిల్స్ కేక్ రూపంలో ఉంటాయి. ఈ కొండలు ఒక కేక్ లాగా ఎత్తైన శిఖరాలు కనిపించే గట్టి పునాదితో ఉంటాయి, చూడడానికి అవి ఆకాశాన్ని అ౦టినట్లుగా ఉంటాయి. ఈ కొండలలో ఎత్తైన శిఖరం భూమి నుండి షుమారు 4338 మీటర్లు ఉంటుంది. స్వామిమలై కొండలు పర్వతారోహకులు ఎక్కువగా కోరుకునే దారి. స్వామిమలై ట్రెక్ దారి రానూ పోనూ షుమారు 6 కిలోమీటర్లు ఉంటుంది.
ఈ దారి వెంట శిఖరం దాకా వెళ్తే మొత్తం కొండలన్నీ కనిపిస్తాయి. జవాది హిల్స్, పల్లమతి హిల్స్ లాగా ఇక్కడికి దగ్గరగా వుండే కొండలు కూడా ప్రసిద్ధ పర్వతారోహణ ప్రాంతాలే. ఈ కొండలు ఎక్కడం తేలిగ్గా వుంటుంది – ఇవి యాత్రికులకు ప్రకృతి సౌందర్యాన్ని కొద్ది దూరం నుంచి ఆస్వాదించే అవకాశం కల్పిస్తుంది. అయితే ఒక రోజంతా ఇక్కడ గడపడానికి సిద్ధం కండి. ఆ రోజు మీరు ఇక్కడ హాయిగా గడపగలరు.