దుబ్డి ఆశ్రమం మొదటగా స్థాపించిన, సిక్కిం లోని పురాతన గోమ్పా. ఇది 1701 లో స్థాపించబడి, న్యింగ్మ తెగకు చెందిన టిబెటన్ ఆశ్రమంలో ఉంది, చోగ్యాల చే ఏర్పాటుచేయబడింది, ఇది బౌద్ధుల ధార్మిక కూటములలో ఒక భాగం. ఇది కొండపై నిలిచి ఉంది. యుక్సోం నుండి అరగంట నడకతో ఇక్కడికి చేరుకోవచ్చు. దుబ్డి ఆశ్రమాన్ని సన్యాసుల సెల్ అనికూడా అంటారు – ల్హాత్సున్ నమ్ఖ జిగ్మే దీనిని స్థాపించిన తరువాత, సిక్కింలో దీని స్థాపన సమయంలో నిర్మించిన ఇతర నాలుగు ఆశ్రమాలలో ఈ ఆశ్రమం మాత్రమే ఉనికిలో ఉంది. దుబ్డి ఆశ్రమం 7000 అడుగుల ఎత్తులో నిలబడి ఉంది చాలా అందంగా, లోపలిభాగం కళాత్మకంగా ఉంటుంది. గోమ్పా గోడలు దేవుళ్ళ, సాధూల అందమైన చిత్రాలతో చిత్రీకరించబడి ఉంటాయి, ఈ ఆశ్రమంలో అందమైన పుస్తకాల సేకరణలు, గ్రంధాలూ, చేతిప్రతులు ఉన్నాయి. అంతేకాకుండా లోపల దుబ్డి స్థాపనకు బాధ్యులైన లామాల మూడు విగ్రహాలు కనిపిస్తాయి. మొత్తమ్మీద, సందర్శనకు ఇది చాలా ఆశక్తికరమైన ప్రదేశం.