అందరికి ఆనందం కలిగించె పసందైన పట్టణం. ఆనంద్ పట్టణం పేరు చెప్పగానే అందరికి అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ కంపెనీ గుర్తు వచ్చేస్తుంది. ఇండియా లో ఈ కంపెనీ క్రింద ఒక పాల ఉత్పత్తిదారుల సహకార ఉద్యమం మొదలైంది. ఆనంద్ ఈ పాల విప్లవంలో కేంద్రంగా వుంది.
ఈ విప్లవం ఇండియా ను చివరకు ఒక అతి పెద్ద పాల, మరియు పాల ఉత్పత్తుల కేంద్రంగా తయారు చేసింది. రాష్ట్ర రాజధాని గాంధీనగర్ నుండి ఆనంద్ 101 కి. మీ.ల దూరంలో వదోదర మరియు అహ్మదాబాద్ ల మధ్య పడమటి రైల్వే విభాగంలో కలదు. శ్రీ రోకాదియా హనుమాజీ టెంపుల్ , సర్దార్ వల్లభాయి పటేల్ మరియు వీర్ వైటల్ భై పటేల్ మెమోరియల్, స్వామీ నారాయణ్ టెంపుల్ వంటి ప్రదేశాలు ఆనంద్ లో చూడ దగినవి.
ఆనంద్ కు ఈశాన్యంగా 43 కి.మీ.ల దూరంలో రంచోర్ దొరై దోకోర్ టెంపుల్ కలదు.