భు౦టర్ , హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు జిల్లాలో ఒక పట్టణం. సముద్ర మట్టానికి 2050 మీటర్ల ఎగువన ఉన్న భు౦టర్ రాష్ట్రంలోని ప్రముఖ గమ్యస్థానాలలో పరిగణింపబడుతుంది. కుల్లు లోయకు ప్రవేశమార్గంగా కూడా ప్రసిద్ధ ఈ పట్టణం గొప్ప చారిత్రిక, ధార్మిక ప్రాముఖ్యతను కల్గి ఉంది.
భు౦టర్ చరిత్ర, క్రైస్తవుల పవిత్ర గ్రంథం, బైబిల్లోని నోవా ను పోలి ఉంటుంది. పురాణాల ప్రకారం, నాగరికత వ్యవస్థాపకుడు మను, హిందూ దేవతల కోసం ఒక ప్రజాస్వామ్య మండలిని ఏర్పాటు చేసాడు. ఈ దేవతలు సమాజంలో నివసించే ప్రజల పాలనా బాధ్యత వహిస్తారు.
ఈ స్థానం బశేశ్వర్ మహాదేవ ఆలయం, జగన్నాథ ఆలయం, అది బ్రహ్మ ఆలయం, బిజ్లి మహాదేవ ఆలయం వంటి అనేక హిందూ ధార్మిక కేంద్రాలకు పేరొందింది. ఇక్కడి మరొక ప్రసిద్ధ దేవాలయం త్రియుగ్ నారాయణ ఆలయం, ఇది స్థితి కారకుడైన దైవం విష్ణువుకు చెందింది. ఇది క్రీ. శ. 800 లో నిర్మించిన పురాతన ఆలయం, భు౦టర్ నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ప్రదేశాలను చూడటంతో బాటుగా, పర్యాటకులు కొండలపై నడవడం, పర్వతారోహణ, కయకింగ్ వంటి అనేక సాహస కార్యకలాపాలు ఇక్కడ చేపట్టవచ్చు. ఇక్కడి మరొక పేరొందిన ఆకర్షణ ఉత్తర భారతదేశంలో ప్రసిద్ది చెందిన ప్రతి ఏటా జరిగే భు౦టర్ ఉత్సవం. ఈ మూడు రోజుల ఉత్సవం ప్రతి ఏటా జూన్ లేదా జూలై నెలలో జరుగుతుంది.
భు౦టర్ ను చేరడం సులువు, భు౦టర్ కు స్వంత విమానాశ్రయం ఉంది. చండీగఢ్ రైలు స్టేషన్ 320 కిలోమీటర్ల దూరంలోని అతి దగ్గరి రైలు మార్గం. ఈ ప్రాంతానికి న్యూ ఢిల్లీ, చండీగఢ్ నుండి రోజువారి బస్సులు ఉన్నాయి.
భు౦టర్ సందర్శనకు వాతావరణం సౌకర్యవంతంగా ఉండే సెప్టెంబర్ నుండి మార్చ్ నెలల మధ్య గల కాలం ఉత్తమమైనది.