బీజపూర్ ఒక్కసారి దర్శిస్తే చాలు మన గత వైభవం ఏమిటనేది తెలిసిపోతుంది. ఈ పట్టణ శిల్పసంపద, అక్కడ కల లెక్కలేనన్ని చారిత్రక చిహ్నాలు పర్యాటకులకు ఒకప్పటి నగర వైభవాన్ని సంస్కృతిని చాటుతాయి. బీజపూర్ పట్టణం బెంగుళూరు నుండి 521 కి.మీ. దూరం ఉంది. కాలానుగతంగా బీజపూర్ తన శోభను కోల్పోతోంది. అయినప్పటికి అక్కడి మసీదులు, గోపురాలు, కోటలు దాని గత వైభవానికి చిహ్నాలుగా ఉన్నాయి.
బీజపూర్ పట్టణ చరిత్ర - బీజపూర్ పట్టణ చరిత్రలోకి ఒక్కసారి తొంగి చూస్తే దాని గత వైభవం అంతా చక్రవర్తి అదిల్ షా వంశ వైభవంగా కనపడుతుంది. యూసఫ్ అదిల్ షా 1490 సంవత్సరంలో బీజపూర్ నగరాన్ని స్ధాపించాడు. అదిల్ షా తర్వాతి కాలంలో అధికారానికి వచ్చిన రాజులు సైతం ఈ పట్టణ అభివృధ్ధికి అద్భుతమైన శిల్పకళా నైపుణ్యానికి కృషి చేశారు.
ఈ పట్టణంలోని చారిత్రక చిహ్నం గోల్ గుంబజ్ గురించి చెప్పనిదే, ఎన్నింటిని గురించి చెప్పినా ప్రయోజనం లేదు. అదిల్ షా సమాధి అయిన గోల్ గుంబజ్ ఒక వైభవోపేతమైన సమాధి. సెయింట్ పీటర్స్ బేసిలికా తర్వాత ఇదే పెద్ద సమాధిగా చెప్పవచ్చు. మరికొన్ని ప్రధాన చారిత్రక నిర్మాణాలు అంటే మలికే ఎ మైదాన్. ఇది ఆ కాలంనాటి ప్రపంచ రెండవ ఫిరంగి. ఎత్తైన ఉప్లి బురుజు మరియు చాంద్ బావడి, పట్టణంలోని 20 మిలియన్ లీటర్ల నీటిని నిలువ చేయగల నీటి ట్యాంకు వంటివి పాలకులు వైభవాన్ని చాటుతాయి.
ఈ పట్టణంలో ఒక పురాతన కోట ప్రహరీ అవశేషాలు, కోట మరియు పట్టణంలోని మరికొన్ని సమాధులు, మసీదులు, ఇతర రనిర్మాణాలు కూడా ఉన్నాయి. ఐ హోళే, పట్టడాకల్ మరియు బాదామిల లోని చాళుక్య దేవాలయాలకు దీటుగా బీజపూర్ లోని మొగల్ కట్టడాలు కనపడతాయి.
దేశంలోని అన్ని ప్రాంతాలనుండి బీజపూర్ పట్టణం తేలికగా చేరుకోవచ్చు. దీనికి సమీప విమానాశ్రయం బెల్గాం. రైలు సర్వీసులు బెంగుళూరు మరియు గోవాలనుండి కలవు.