దీనినే వైస్రాయ్ చర్చ్ అని కూడా పిలుస్తారు. ఇది భారత దేశ సుందర చర్చిలలో ఒకటిగా పేరుగాంచింది. రాష్ట్రపతీ భవన్ మరియు పార్లమెంటు కి తూర్పుగా ఉంటుంది ఈ చర్చ్. 1927-1935 మధ్య కాలం లో హెన్రీ మడ్ చే నిర్మించబడింది ఈ చర్చ్. "కలోనియల్" శిల్ప కళా వైభవానికి ప్రతీక ఈ కట్టడం.ఉత్తర భారత దెశపు చర్చీల హెడ్ క్వార్టర్స్ ఈ చర్చ్. చూడగానే బర్త్ డే కేక్ మధ్యలో కొవ్వొత్తి నిలబెట్టినట్లుడటమే ఈ చర్చీ ప్రత్యేకత. మండు వేసవి లో కూడా చల్ల గా ఉండటానికి ఇలా నిర్మించారుట.
రెవరెండ్ టీవీ డిక్సన్ గారు చాప్లెన్ గా నియమింపబడి భారత దేశం లో ఆంగ్లేయుల బాగోగులు చూడటానికి వచ్చినప్పటి నుండీ ఈ చర్చ్ ఉనికి ప్రారంభమయ్యింది.1935 లో దీని కట్టడం పూర్తి అయ్యింది. పచ్చటి ఉద్యానవనం మధ్య లో గల ఈ చర్చ్ లో కి ఎవరైనా ప్రవేశించవచ్చు.