ఘటి సుబ్రమణ్య దేవాలయం దొడ్డబల్లాపూర్ కు దగ్గరగా బెంగుళూరు నగరానికి 60 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ పట్టణం బెంగుళూరు గ్రామీణ జిల్లాలో ఉంది. ఈ దేవాలయం ఎంతో ప్రాచీన కాలంనుండి విశేషత సంతరించుకొంది. యాత్రికులు సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటారు.
ప్రతినిత్యం వేలాది భక్తులు ఈ దేవాలయ సుబ్రమణ్యేశ్వరుడిని దర్శించుకొని తమ కానుకలు అర్పించుకుంటారు. ఈ దేవాలయ విశిష్టత ఏమిటి? ఇక్కడి ప్రధాన దేవతలు సుబ్రమణ్య మరియు లక్ష్మీ నారాయణులు. విగ్రహ విశేషత ఏమీ లేదు. ఇరువురు దేవుళ్ళు ఒకే విగ్రహంలో చెక్కబడ్డారు. సుబ్రమణ్యేశ్వరుడు తూర్పు దిశగాను లక్ష్మీ నారాయణుడు పడమటి వైపుగాను ఉంటారు.
భక్తులు లక్ష్మీ నారాయణుడిని ఒక అద్దం నుండి దర్శిస్తారు. దేవాలయ శిల్ప నైపుణ్యత, అక్కడి ప్రత్యేక పండుగలు, ఇతర వేడుకలు భక్తులను తరలి వచ్చేట్లు చేస్తాయి.
ఘటి సుబ్రమణ్య దేవాలయం దర్శనతో పాటు ఆహ్లాదకర గ్రామీణ ప్రాంతాల సహజ సౌందర్యాలను కూడా చూసి ఆనందించవచ్చు. దొడ్డబల్లాపూర్ ప్రాంతంలో మరికొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. సమీపంలోనే నంది హిల్స్ కూడా ఉంటుంది.
ఈ దేవాలయానికి సమీప విమానాశ్రయం బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. బెంగుళూరు నుండి దొడ్డబల్లాపూర్ కు ఎన్నో బస్సులు ప్రతిరోజూ నడుస్తాయి. దొడ్డబల్లాపూర్ నుండి ఘటి సుబ్రమణ్య చేరాలంటే, స్ధానిక వాహనాలు ఉపయోగించాలి. ఈ స్ధలానికి సమీప రైల్వే స్టేషన్ మాకలి దుర్గ.