గ్రేట్ నికోబార్ ద్వీపాలలోనికోబార్ ద్వీపంలో దక్షిణ దిశలో చివరగా ఉండే ప్రదేశం ఇందిరా పాయింట్. అంతేకాక, భారతదేశానికి కూడా ఇది దక్షిణ దిశలో చివరి భాగం అవటంతో పర్యాటకులలో ప్రత్యేకించి స్ధానికులలో మరింత ఆసక్తిని కలిగిస్తుంది. 1972 నుండి పర్యాటకులు ఇందిరాపాయింట్ కు అధిక సంఖ్యలో వస్తూనే ఉన్నారు.
ఈ ప్రదేశానికి ఇందిరా పాయింట్ అని భారత దేశ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ పేరుతో పెట్టారు. ఇక్కడకల లైట్ హౌస్ అతి పెద్దది కావటమే కాదు, ఎంతో అందంగా కూడా ఉంటుంది. ఎర్రని మరియు తెల్లని చారలు కలిగి ఒక హెలిప్యాడ్ కూడా కలిగిన ఈ లైట్ హౌస్ చూచేందుకు ఎంతో బాగుంటుంది.
2004 లో వచ్చిన సునామి కారణంగా ఈ లైట్ హౌస్ కొంత నష్టపోయింది. అయితే, తర్వాతి కాలంలో బాగుచేయబడి మలేషియా, మలాక్కా ఇండియా మార్గంలో వచ్చే ఓడలకు సేవలందిస్తోంది. దీని రేంజి సుమారుగా 16 నాటికల్ మైల్స్ కలిగి ఉంది. పర్యాటకులకు అనుమతినిచ్చేది ఈ లైట్ హౌస్ వద్ద మాత్రమే. అక్కడకు వచ్చిన పర్యాటకులు అండమాన్ మరియు నికోబార్ దీవుల అందాన్ని తనివితీరా చూసి ఆనందిస్తారు.
దీవులు ఎంత అందంగా ఉంటాయో, ఇందిరా పాయింట్ కూడా అంత అందంగా ఉంటుందని ప్రశంసిస్తారు.