నిలచల్ కొండపై ఉన్న ప్రముఖమైన ఆలయం భువనేశ్వరి టెంపుల్. హిందూ పురాణాల ప్రకారం పది మహావిద్యా దేవతలలో నాలుగవ వారైనా అమ్మవారికి అంకితమివ్వబడిన ఆలయం ఇది. 7 మరియు 9 వ దశాబ్దం మధ్యలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని భావించవచ్చు. కామాఖ్య ఆలయంతో ఈ ఆలయ నిర్మాణం పోలి ఉంటుంది. ఇక్కడ లభించే ప్రశాంతత కోసం పర్యాటకులు అలాగే భక్తులు తరలి వస్తారు.
ప్రతి రోజు వందల మంది పర్యాటకులు ఈ ఆలయానికి తరల వస్తారు. అమ్బుబచి మరియు మానస పూజ సమయం లో ప్రపంచ నలుమూలల నుండి అనేకమంది పర్యాటకులని ఈ ఆలయం ఆకర్షిస్తుంది. కామాఖ్య నుండి ఈ ఆలయానికి కాలినడకన చేరుకోవడానికి ఎంతో మంది పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు. ఆ కాలినడక బాట లో కిందనే ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నదీ అందాలూ కనువిందు కలిగిస్తాయి. భువనేశ్వరి ఆలయం నుండి గువహతి నగరం యొక్క విశాలవీక్షణం ఆనందం కలిగిస్తుంది.