హస్తినాపూర్ ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ కు సమీపంలో గంగా నది ఒడ్డున కలదు. దీని పుట్టు పూర్వోత్తరాలు మహాభారత కాలం నాటివి. ఈ నగరం కౌరవులకు రాజధానిగా వుండేది. ఇతిహాసం మేరకు పాండవులకు, కౌరవులకు మధ్య యుద్ధం జరిగినది. పాండవులు యుద్ధంలో గెలిచి హస్తినాపూర్ రాజధానిగా సుమారు36 సంవత్సరాలు, కలియుగం మొదలు అయ్యే వరకూ పాలించారు. పైన పేర్కొనిన నమ్మకానికి ఆధారంగా అనేక ఖగోళ, భౌగోళిక, భౌతిక, గ్రంధ పర ఆధారాలు లభించాయి. అర్కేయోలజికల్ సర్వే అఫ్ ఇండియా శాఖ ఈ టవున్ లో అనేక తవ్వకాలు జరిపి అనేక టెంపుల్స్ మరియు స్మారకాలను వెలికి తీసింది.
హస్తినాపూర్ జైన మతస్తులకు కూడా ప్రధానమైనదే. వారి ఇరవై నాలుగు తీర్ధన్కరులలో , 16,17,18 వ తీర్తంకరులు ఇక్కడే జన్మించారు. కనుక ఈ టవున్ ప్రతి సంవత్సరం అనేక మంది జైనులను కూడా ఆకర్షిస్తుంది.
హస్తినాపూర్ లో సైట్ సీయింగ్
పైన చెప్పినట్లు హస్తినాపూర్ హిందువులు, జైనులచే గౌరవించబడుతోంది. ఇక్కడ అనేక ఆసక్తి కర పర్యాటక ప్రదేశాలు కలవు. ఓల్డ్ పాన్దేస్వర టెంపుల్, కరణ్ టెంపుల్, లోటస్ టెంపుల్, మొదలైనవి. జైనులకు సంబంధించి దిగంబర్ జైన్ బడా మందిర్, జైన్ జంబు ద్వీప్ మందిర్, శ్రీ శ్వేతంబార్ జైన్ టెంపుల్ లు కలవు. ఇవే కాక, ఇంకా కైలాష్ పర్వతం, అష్టపద,1986 లో కనుగొనిన హస్తినాపూర్ సంక్చురి, వంటివికూడా కలవు.
ఎలా చేరాలి ?
హస్తినాపూర్ మీరట్ కు సుమారు 37 కి.మీ.ల దూరంలో వుంటుంది. కనుక, ట్రైన్ లో మీరట్ చేరాలి. అక్కడనుండి టాక్సీ లేదా బస్సు లలో సిటీ చేరవచ్చు.