జగదల్పూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్టర్ జిల్లా యొక్క పాలనా కేంద్రంగా ఉంది. జగదల్పూర్ పచ్చని పర్వతాలు,పచ్చని చెట్లు,లోతైన లోయలు,దట్టమైన అడవులు,ప్రవాహాలు,జలపాతాలు,గుహలు, సహజ పార్కులు,అద్భుత కట్టడాలు,గొప్ప సహజ వనరులు,అతిశయమైన పండగ వాతావరణం కలిగి ఆనందకరమైన ఏకాంతానికి ప్రసిద్ధి చెందింది.
జగదల్పూర్ మంత్రముగ్ధమైన సహజ అందం మరియు విస్తారంగా అడవి జంతువులు ఉన్న రిజర్వ్ మరియు దాని సంప్రదాయ జానపద సంస్కృతి ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకతను పెంచుతుంది. ధంతరిలో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. వాటిలో కొన్ని కంగేర్ వాలీ నేషనల్ పార్క్, ఇంద్రావతి నేషనల్ పార్క్, చిత్రకోతే జలపాతాలు,చిత్రధార జలపాతాలు,ద్వీపం యొక్క అందం,సంగీత ఫౌంటెన్,దల్పత్ సాగర్ లేక్ ఉన్నాయి.
జగదల్పూర్ - కళలు మరియు చేతిపనులు
సమాజం, సంస్కృతి మరియు కళ చేతి పనులపై ఒక డాక్యుమెంటేషన్ ఉన్నది. వారి పనులలో నిమగ్నమై ఉండగా గిరిజన మరియు జానపద కళాకారులు మరియు క్రాఫ్ట్ వ్యక్తులు వారి ఆలోచనలు,భావనలు మరియు ఊహాశక్తి కాంక్రీటు వ్యక్తీకరణలను ఇస్తారు. వస్తువులు మరియు రోజువారీ ఉపయోగించే కళాఖండాల తయారీ కూడా వారి కళాత్మక ఊహ మరియు అందం యొక్క కోణంలోనే పని చేస్తారు. వారి దేవుళ్లు మరియు దేవతల అనుగ్రహం అనుష్ఠాత్మక కళాత్మక సమర్పణలు,వారి సంప్రదాయం శతాబ్దాల క్రిందటే వారి కళ సజీవంగా మరియు శక్తివంతముగా నిలుపుకుంది. నిజానికి కళ అనేది వారి మనుగడలో ఒక భాగంగా ఉన్నది.
జగదల్పూర్ గిరిజన మరియు జానపద కళ మరియు క్రాఫ్ట్ ప్రపంచంలోకి వెళ్ళటం అనేది ఒక మనోహరమైన ప్రయాణంగా ఉంటుంది. గిరిజన కళాకారులు మరియు క్రాఫ్ట్ వ్యక్తులు వారి గత కళ యొక్క సుసంపన్న సంప్రదాయంను సజీవంగా ఉంచుకుంటారు. అక్కడ మట్టి అచ్చు,చెక్క,రాయి,మెటల్,మనసుకి హత్తుకొనే ఆకారాలు,రూపాలు,ఆకర్షణీయమైన మరియు ఆకట్టుకునే డిజైన్స్ చూడవచ్చు.
జగదల్పూర్ ఇనుము క్రాఫ్ట్ యొక్క సంప్రదాయం తరం నుండి తరంనకు నైపుణ్యం మరియు సృజనాత్మకత పెరుగుతుంది. ఈ ప్రాంతంలో మెటల్ క్రాఫ్ట్ ఒక ప్రత్యేకమైన మోటైన మనోజ్ఞతను కలిగి ఉంటుంది. ఈ ప్రాంతంలో కళాకారులు ఇనుము శిల్పాలను సంప్రదాయ లేదా ఊహాత్మక థీమ్ లో తయారు చేస్తారు. ఈ థీమ్ లలో స్థానిక దేవుళ్లు,సాయుధ గిరిజన సైనికులు,గుర్రాలు,పందులు మరియు వివిధ రకాల పక్షులు ఉంటాయి. ఉత్పత్తులలో ప్రదానంగా అలంకరణ,ఆరాధన మరియు రోజువారీ పనిచేసే పరికరాలు ఉంటాయి.
జగదల్పూర్ - ప్రజలు మరియు సంస్కృతి
జగదల్పూర్ ప్రజలలో వేర్వేరు తెగలు ఉన్నాయి. ఇక్కడ కనిపించే కొన్ని తెగలు గొండ్స్,మురిఅస్,హల్బాస్ మరియు అభుజ్మరియా అని చెప్పవచ్చు. గొండ్స్ తెగ భారతదేశంలో అతిపెద్ద గిరిజన సమూహంగా చెప్పవచ్చు. అంతేకాక జగదల్పూర్ గిరిజన జనాభాలో ఎక్కువ భాగం గొండ్స్ తెగ ఉన్నారు. వారు ప్రధానంగా ఒక సంచార జాతి మరియు కోయ్తోరియా అని కూడా పిలుస్తారు. మురియా గోండ్ తెగకు ఉప సమూహంగా చెప్పవచ్చు.
మురియా తెగ వారు సాధారణంగా సంచార గోండ్ మాదిరిగా కాకుండా శాశ్వతంగా గ్రామాలలో నివసిస్తారు. వారు ప్రధానంగా వ్యవసాయం,వేట మరియు అడవి పండ్లు తినడం ద్వారా మనుగడ సాగిస్తారు. మురియా తెగ వారు సాదారణంగా వెదురు,మట్టి మరియు గడ్డితో కప్పబడే పై కప్పు గల ఇంటిలో చాలా పేదగా నివసిస్తారు. హల్బాస్ అనే తెగ వారు అభివృద్ధి మరియు ధనిక తెగలలో ఒకటి. వారు భూమి యజమానులు లేదా భూస్వాములుగా ఉంటారు.
హల్బాస్, రాష్ట్రంలో గిరిజనులు మధ్య వారి దుస్తులు,వైఖరి మరియు సామాజిక కార్యకలాపాల కారణంగా ఉన్నత 'స్థానిక హోదా' ఆస్వాదించవచ్చు. అభుజ్మరియా తెగలు జగదల్పూర్ జిల్లాలో అబుజ్హ్మర్ పర్వతాలు మరియు కుత్రుమార్ హిల్స్ వంటి భౌగోళికంగా అసాధ్యమైన ప్రాంతాల్లో కనిపిస్తారు.
జగదల్పూర్ చేరుకోవడం ఎలా
జగదల్పూర్ రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా రాష్ట్రంలో ప్రధాన నగరాలకు అనుసంధానించబడింది.