నగరం నడిబొడ్డున వుండే జైసల్మేర్ కోట ను జైసల్మేర్ కు గర్వ కారణంగా భావిస్తారు. పసుపు రంగు ఇసుకరాయి తో నిర్మించిన ఈ కోట సూర్యాస్తమయం లో బంగారంలా మెరిసిపోవడంతో దీన్ని సోనార్ ఖిల్లా లేదా బంగారు కోట అని కూడా అంటారు. త్రికురా కొండ మీద 1156లో భాటి రాజపుత్ర రాజు జైసల్...
భట్టీ వంశ రాజులు నిర్మించిన రాజ సమాధులు వున్న పెద్ద పార్క్ గా బడా బాగ్ ప్రసిద్ది చెందింది. మహారావాల్ జైత్ సింగ్ సమాధి అన్నిటికన్నా పురాతనమైనది. ఈ ప్రాంతం జైసల్మేర్ నగరానికి 6 కిలోమీటర్ల దూరంలో వుంది. సమాధులే కాకుండా, ఈ పార్కు లోపల జైత్ సార్ సరస్సు, జైత్ బాంద్...
ఎడారి సాంస్కృతిక కేంద్రం, మ్యూజియం గడ్సిసార్ రోడ్డు మీద జైసల్మేర్ నగరానికి దగ్గరలో వుంది. 1997 లో స్థాపించిన ఈ కేంద్రం లో ప్రాచీన పరికరాలు, అరుదైన శిలాజాలు, ప్రాచీన శాసనాలు, మధ్యయుగపు నాణేలు, సాంప్రదాయ కళాకృతులు ప్రదర్శిస్తారు. గంజాయి కలుపుకునే సాంప్రదాయ పెట్టె...
జైసల్మేర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ మూల్ సాగర్. ఇది సాం ఇసుక తిన్నెలకు వెళ్ళే దారిలో వుంది. ఒక సరస్సుతో పాటు అందమైన తోట కూడా వున్న మూల్ సాగర్ జైసల్మేర్ లోని రాజ కుటుంబీకులకు వేసవి విడిదిగా నిర్మించబడింది. యాత్రికులు ఈ తోట లోపల శివాలయం...
14 వ శతాబ్దంలో మహార్వాల్ గడ్సీ నిర్మించిన గడ్సిసర్ సరస్సు ఒక కృత్రిమ జలాశయం. ఈ వర్షపునీటి సరస్సు ఆ కాలం లో ప్రధాన జలవనరుగా ఉండేది. ఈ సరస్సు ఒడ్డున చాలా చిన్న చిన్న దేవాలయాలు వున్నాయి. ఈ సరస్సులో వలస పక్షులను యాత్రికులు చూడవచ్చు. ఈ పక్షులు భరతపూర్ పక్షుల కేంద్రం...
జైసల్మేర్ కోటలో జైన దేవాలయాలు వున్నాయి. ఈ పాత గుళ్ళు 12 -15 శతాబ్దాల మధ్య నిర్మించారు. ఇవి శంభదేవుడు, రిషభదేవుడు అనే జైన తీర్థంకరుల కోసం నిర్మించారు. ఈ దేవాలయం గోడలపై దిల్వారా శైలి చిత్రాలు, అందమైన మనుషులు, జంతువుల బొమ్మలు చూడవచ్చు.
దేశంలోని ఏడు ప్రధాన జైన దేవాలయాల్లో శాంతినాద్ దేవాలయం ఒకటి. ఇది జైసల్మేర్ కోట లో జైన తీర్థంకరుడు శాంతినాధుని కోసం నిర్మించారు. ఆయన్ను ఒక అద్భుతంగా చెక్కిన అందమైన విగ్రహ రూపంలో పూజిస్తారు. ఈ దేవాలయం అద్భుత నిర్మాణ శైలికి ప్రసిద్ధం.
మొదటి జైన తీర్థంకరుడు రిషభ దేవుని కోసం నిర్మించిన రిషభ దేవా దేవాలయం మూల్ సాగర్ ఒడ్డున వుంది. రాజస్థానీ నిర్మాణ శైలికి ఈ గుడి ప్రసిద్ది పొందింది. ఈ గుడి నిర్మాణం 16వ శతాబ్దంలో జరిగింది. చెక్కుడు తో వున్న ఈ గుడి ముఖ భాగం దీని అందానికి ఆకర్షణ జత చేస్తుంది.
చంద్రప్రభు దేవాలయం జైసల్మేర్ కోట లోని జైన దేవాలయం. దీన్ని 1509లో నిర్మించారు. 8వ జైన తీర్థంకరుడు చంద్రప్రభు కోసం నిర్మించిన ఈ దేవాలయ౦ దేశంలోని ఏడు ప్రధాన జైన దేవాలయాల్లో ఒకటి. ఈ ఎర్ర రాతి దేవాలయం తన రాజపుత్ర నిర్మాణ శైలికి ప్రసిద్ది. క్లిష్టతరమైన చెక్కుళ్ళు,...
జైసల్మేర్ కోట లో వున్నా ఏడూ జైన దేవాలయాల్లో శీతల్నాద్ దేవాలయం ఒకటి. ఈ గుడి ని 16వ శతాబ్దంలో రాజపుత్ర నిర్మాణ శైలిలో నిర్మించారు. 10వ జైన తీర్థంకరుడు శీతల్నాద్ కోసం దీన్ని నిర్మించారు. ఎనిమిది విలువైన లోహాలతో నిర్మించిన ఈ దేవాలయం శీతల్నాద్ విగ్రహానికి ప్రసిద్ది...
జైసల్మేర్ నగరంలోని బాదల్ పాలెస్ సముదాయానికి దగ్గరలో ఉన్న ఐదు అంతస్తుల భవంతి ఈ తాజియా టవర్. ఈ భవంతిని ముస్లిం చేతివృత్తుల వారు మహారావల్ బేరిసల్ సింగ్ కు కానుకగా ఇచ్చారు. కర్బలా లో ముహారం పండుగ సమయంలో తీసుకువెళ్ళే చెక్కతో, వెదురుతో, కాగితంతో చేసే...
కుల్దారా, జైసల్మేర్ నగరం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రిక గ్రామం. పర్యాటకులు సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్యలో మాత్రమే సందర్శించడానికి అనుమతి౦చబడే భయానక గ్రామము. 200 సంవత్సరాల నాటి మట్టి ఇల్లు ఇక్కడ చూడవచ్చు. చరిత్ర ప్రకారం, ఈ గ్రామంలో 500 సంవత్సరాల పాటు...
జైసల్మేర్ లోని మొట్టమొదటి భవంతి అయిన పట్వోన్ కి హవేలీ పాట్వా సముదాయానికి దగ్గరలో ఉంది. 1805 వ సంవత్సరంలో గుమన్ చ౦ద్ పాట్వా తన ఐదుగురు కుమారుల కోసం నిర్మించిన ఈ సముదాయంలో ఐదు భవంతులు ఉన్నాయి. ఈ పసుపు ఇసుకరాయి భవంతి పూర్తిచేయడానికి 50 సంవత్సరాలు పట్టింది. ప్రస్తుతం,...
మహారాజా పాలెస్, జైసల్మేర్ కోట సముదాయంలో ఉంది. దీనిని జైసల్మేర్ కోట భవన మ్యూజియం, హెరిటేజ్ సెంటర్ అంటారు. ఈ భవనం ఐదు అంతస్తులతో, అద్భుతంగా చెక్కిన కిటికీలు, బాల్కనీల తో ప్రసిద్ది చెందింది. చలువ రాయితో చేసిన ఈ రాజభవన ఎడమ ప్రవేశ ద్వారములో రాజులు తమ ప్రజలను...
జైసల్మేర్ కోట బయట వున్న మానక్ చౌక్, హవేలీలు ప్రధాన పర్యాటక ఆకర్షణలు. ఇక్కడి హవేలీలు అందమైన కళాకృతులు చేతి పనులతో అలంకరించబడి వుంటాయి. ఈ హవేలీలు అన్నిటిలో పట్వోన్ కీ హవేలీ, సలీం సింగ్ కీ హవేలీ, నాద్ మల్ జీ కీ హవేలీ ప్రసిద్ధ కట్టడాలు.
మార్కెట్ గా ఉపయోగించబడే...