కలాడి గ్రామం పెరియార్ నది సమీపంలో కలదు. ఈ గ్రామం భౌగోళికంగా కేరళలోని ఎర్నాకుళంలో కలదు. ఈ ప్రదేశం జగద్గురువు ఆదిశంకరులవారి జన్మస్ధలం.
ఈ ప్రదేశం దేశవ్యాప్తంగా ఒక యాత్రా స్ధలంగా ప్రసిద్ధి గాంచింది. ప్రత్యేకించి ఆది శంకరాచార్య మతాన్ని ఆచరించేవారందరకు ఇది పవిత్ర స్ధలం. 1910 సంవత్సరంలో ఇక్కడ ఆది శంకరుల వారికి ఒక దేవాలయం ఏర్పరచారు. కలాడీ అంటే పాద ముద్ర అని అర్ధం. ఈ గ్రామాన్ని మొదటిలో ససలాం అనేవారు. కలాడి శతాబ్ది ఉత్సవాలు 2010 సంవత్సరంలో నిర్వహించినట్లు పత్రికలు పేర్కొంటాయి.
ఒక ఆసక్తికర ఇతిహాసం
ఈ పట్టణం లోని ఆదిశంకరుల, వారి తల్లి గార్లగురించి ఎన్నో కధలు చెప్పుకుంటారు. పెరియార్ నదిని గతంలో పూర్ణ నది అనేవారు. నది శంకరాచార్య మరియు ఆయన తల్లి ఉన్న స్ధలానికి దూరంగా ఉండేది. ఒక రోజున ఆయన తల్లి స్నానాకికి నదికి వెళుతూ మధ్యలో మూర్ఛిల్లింది. నిస్సహాయుడైన శంకరుడు శ్రీక్రిష్ణుడిని ప్రార్ధించాడు. ప్రార్ధనలు వినిన శ్రీ క్రిష్ణుడు, దయతలచి ఆయనను ఆశీర్వదించాడు. శంకరులవారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నది ప్రవహిస్తుంది అని పలికాడు. క్రిష్ణుడి ఆశీస్సుల ఫలితంగా, నది ఆ చిన్ని శంకరుడి ఇంటి తోటలోకి కూడా ప్రవహించింది. అపుడు శంకరాచార్యులు క్రిష్ణుడికి ఒక చిన్న దేవాలయం కట్టించి పేరు పొందిన అచ్యుతాష్టకాన్ని పఠించారు. ఈ ప్రదేశంలో ప్రధాన ఆకర్షణలు అంటే దేవాలయాలు, ఆశ్రమాలు. వాటిలో రామక్రిష్ణాశ్రమం, కలిల్ దేవి దేవాలయం, శ్రింగేరి మఠం సముదాయం, మహదేవ దేవాలయం, వనమూర్తి దేవాలయం, కుజుప్పిల్ క్కవే జలదుర్గ దేవాలయం మొదలైనవి ప్రసిద్ధి గాంచినవి.
కలాడి సందర్శనకు మంచి సమయం ఎపుడు?
కలాడి సందర్శనకు ఆగస్టు నుండి మార్చి వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ సమయం చల్లగా వుండి పర్యాటకులకు హాయిగా ఉంటుంది. కలాడి ప్రదేశానికి దక్షిణ ఇండియాలోని అన్ని ప్రధాన నగరాలనుండి రోడ్డు, రైలు మరియు వాయు మార్గ సౌకర్యాలు కలవు.