కొట్టాయం కేరళలో ఒక పురాతన నగరం. ఇది కొట్టాయం జిల్లాలో, దేవుని స్వంత భూమి యొక్క జిల్లాలో ఒకటి. ముద్రణ మాద్యమం మరియు సాహిత్యంలో ఈ నగరం యొక్క సేవను పరిగణించి కొట్టాయం ను "అక్షర నగరి" అనగా "అక్షరాల నగరం" గాపిలవబడుతుంది. కొట్టాయం అనే పేరు మలయాళ పదాలైన 'కొత్త' అనగా కోట మరియు 'ఆకం' అనగా 'అంతర్భాగం'ల నుండి ఉద్భవించిందని చెప్తారు, ఈ పదానికి అర్ధం 'కోట యొక్క లోపలిభాగం'.కొట్టాయం పాత పట్టణంను ఇప్పుడు కున్నుమ్పురం అని అంటారు, మరియు ఇది ఒక కొండ మీద ఉన్న నగరం అని పేరు పొందింది. ట్రావన్కోర్ రాజు యొక్క ఆదినంలో ఉండుట వల్ల కొట్టాయం నగరం ఉనికిలోకి వచ్చింది. తూర్పు మరియు పశ్చిమ కనుమలు సరిహద్దులు గల వెంబనాడ్ సరస్సు మంత్రముగ్దులను చేస్తుంది. ఇది ప్రకృతిలో ఒక అద్భుతమైన ప్రదేశం.
అందమైన పర్వతాలు, ప్రాచినమైన కొండలు, పచ్చని లోయలు, కళ్ళు తిప్పుకోలేని సౌందర్యం ఉంటుంది. రబ్బరు తోటల పెంపకం, స్థానికంగా ఉండే ప్రముఖులు మరియు అధిక అక్షరాస్యత రేటు మరియు ఆకర్షణీయమైన సరస్సులు వంటివి కొట్టాయంలో ఉన్నాయి.కొట్టాయం నగరం సుగంధ ద్రవ్యాలు మరియు వాణిజ్య పంటలకు, ప్రత్యేకించి రబ్బర్ కు ప్రధాన వ్యాపార కేంద్రం. భారతదేశంలో ఈ ప్రదేశం నుండి సహజ రబ్బర్లు చాల ఉత్పత్తి అవుతాయి. మలయాళ మనోరమ మరియు దీపిక వంటి కేరళ యొక్క ప్రధాన ప్రచురణ మాధ్యమానికి ఈ నగరం ముఖ్య కేంద్రం.కొట్టాయం 100% అక్షరాస్యత రేటు సాధించి భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది.భారతదేశంలో మొదటి పొగాకు రహిత జిల్లా గా పేరు పొందింది. కొట్టాయం భారతదేశం లో మొదటి పర్యావరణ నగరంగా పేరు పొందింది. దాని సహజ సౌందర్యం మరియు దాని గొప్ప సాంస్కృతిక వారసత్వ కారణంగా, కొట్టాయం ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. ప్రతి సంవత్సరం వేలాదిమంది పర్యాటకులు విశ్రాంతి మరియు కేరళ సంపన్నమైన సాంస్కృతిక విలువలు కోసం వస్తు ఉంటారు.
పూంజర్ ప్యాలెస్ కేరళ యొక్క గొప్ప సంస్కృతికి ఒక ఉదాహరణ.కొట్టాయం నగరంలో సందర్శకులకు అనేక ఆలయాలు,పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.తిరునక్కర మహాదేవ ఆలయం,పల్లిప్పురతు కవు, తిరువేర్పు ఆలయం మరియు సరస్వతి ఆలయం,సుబ్రమణ్య స్వామి ఆలయం కొట్టాయం దగ్గరలో ప్రసిద్ధ ఆలయాలుగా ఉన్నాయి.మీనచిల్ నది ఒడ్డున ఉన్న తజతంగడి జుమ మస్జిద్, మరియు పాత సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ చర్చిలను ప్రతి రోజు ఎంతో మంది పర్యాటకులు సందర్శిస్తారు.కొత్తతవళం వద్ద ఉన్న గుహ మరొక పర్యాటక హాట్ స్పాట్ అని చెప్పవచ్చు.మీరు కొట్టాయం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా నత్తకం మరియు పనచికాడు అనే అందమైన సుందరమైన గ్రామాలను సందర్శించాలి.ఈ గ్రామాల లో మన మనసుకు చాల ప్రశాంతత కలుగుతుంది. అంతేకాకుండా, ఎలవీజ్జ పూంచిరాను మీ పర్యటనలో మిస్ చేయకండి.
కొట్టాయం నుండి, మీరు మున్నార్,ఎర్నాకులం , పీర్మడే , తెక్కడి, మధురై, వైకోమ్, శబరిమల, ఎట్టుమనూర్ మరియు మరిన్ని సమీప స్థలాలను కూడా సందర్శించంచవచ్చు. కొట్టాయం మీకు మంచి జ్ఞాపకాలను మిగులిస్తుంది.ఇక్కడ బోటింగ్, స్విమ్మింగ్ మరియు చేపలు పట్టడం, ఫోటోగ్రఫీ, ట్రెక్కింగ్ మరియు నీటి సంబంధిత క్రీడల కోసం ఒక మంచి అద్భుతమైన ప్రదేశం. కొట్టాయం పట్టణం కేరళ అన్ని పట్టణాలు మరియు నగరాలతో చక్కగా అనుసంధానించబడింది. ఇది విమాన,రైలు,రోడ్డు మరియు జలమార్గాలు ద్వారా చేరుకోవచ్చు. కొట్టాయం సంవత్సరంలో ఏ కాలంలోనైనా సందర్శించవచ్చు. అయితే, మీరు సందర్శించడానికి ఉత్తమ సమయం శీతాకాలం.